బూట్లలో బంగారం పట్టివేత
- August 25, 2015
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనధికారికంగా తీసుకువచ్చే బంగారం పట్టుబడుతూనే ఉంది. మంగళవారం దాదాపు కిలోన్నర దొరకగా, తాజాగా మరో కిలోన్నర బంగారం పట్టుబడింది. బుధవారం ఉదయం దుబాయ్ నుంచి వచ్చిన విమాన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. అందులో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించటంతో అధికారులు వారిని పరిశీలించారు. వారు ఇద్దరు వేసుకున్న షూలలో కిలోన్నర బంగారు బిస్కెట్లు లభ్యమయ్యాయి. బంగారం స్వాధీనం చేసుకుని, సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!







