నాటో దళాలు జరిపిన వైమానిక దాడిలో 30 మంది మృతి..

- November 03, 2016 , by Maagulf
నాటో దళాలు జరిపిన వైమానిక దాడిలో 30 మంది మృతి..

అఫ్గానిస్తాన్‌లో గురువారం నాటో దళాలు జరిపిన వైమానిక దాడిలో మహిళలు, చిన్నారులు సహా 30 మంది పౌరులు చనిపోయారు. మరో 25 మంది గాయపడ్డారు. కుందుజ్‌ ప్రావిన్సులో ఈ దాడులు జరిగాయి. గత నెలలో కుందుజ్‌ ప్రావిన్సును తాలిబాన్‌ ఉగ్రవాదులు ఆక్రమించారు.ఈ ఏడాది కుందుజ్‌పై వారు ఆధిపత్యం సాధించడం ఇది రెండోసారి. తాలిబాన్‌తో అఫ్గాన్‌-అమెరికా దళాలు పోరాడుతుండగా ఇద్దరు అమెరికా సైనికులు మరణించారు. ఈ నేపథ్యంలోనే నాటో వైమానిక దాడులు జరిపినట్లు అనుమానిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com