అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న మహిళ....
- November 06, 2016
అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న మహిళను దిల్లీ విమానాశ్రయంలో అధికారులు అరెస్టు చేశారు. సుమారు రూ.61 లక్షల విలువ చేసే బంగారాన్ని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. బంగారు కడ్డీలను ఒక మహిళ తన దుస్తుల మధ్యలో ఉంచి తరలిస్తుండటాన్ని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తనిఖీల్లో భాగంగా గుర్తించారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు దుబాయి నుంచి వచ్చినట్లు తెలిపారు. 1,400 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల 12 బంగారు కడ్డీలు, సహా 110 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.61.37 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- CBSE బోర్డులో భారీ మార్పులు..









