అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న మహిళ....
- November 06, 2016
అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న మహిళను దిల్లీ విమానాశ్రయంలో అధికారులు అరెస్టు చేశారు. సుమారు రూ.61 లక్షల విలువ చేసే బంగారాన్ని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. బంగారు కడ్డీలను ఒక మహిళ తన దుస్తుల మధ్యలో ఉంచి తరలిస్తుండటాన్ని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తనిఖీల్లో భాగంగా గుర్తించారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు దుబాయి నుంచి వచ్చినట్లు తెలిపారు. 1,400 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల 12 బంగారు కడ్డీలు, సహా 110 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.61.37 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







