అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న మహిళ....
- November 06, 2016
అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తున్న మహిళను దిల్లీ విమానాశ్రయంలో అధికారులు అరెస్టు చేశారు. సుమారు రూ.61 లక్షల విలువ చేసే బంగారాన్ని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. బంగారు కడ్డీలను ఒక మహిళ తన దుస్తుల మధ్యలో ఉంచి తరలిస్తుండటాన్ని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తనిఖీల్లో భాగంగా గుర్తించారు. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు దుబాయి నుంచి వచ్చినట్లు తెలిపారు. 1,400 గ్రాముల బరువున్న 24 క్యారెట్ల 12 బంగారు కడ్డీలు, సహా 110 గ్రాముల బరువున్న బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.61.37 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం









