రజినీకాంత్ ఇప్పుడు ఫుల్ జోష్తో వచ్చేశారు...
- November 06, 2016
సూపర్ స్టార్ రజినీకాంత్ ఇప్పుడు ఫుల్ జోష్తో వచ్చేశారు. హెల్త్ చెకప్స కోసం రోబో సీక్వెల్ 2.0 బ్రేక్ వేసి మరీ అమెరికా వెళ్లిన రజినీ.. రీసెంట్ గానే ఇంటికి తిరిగొచ్చేశారు.. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి దీపావళి పండుగ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. దాదాపు వారం రోజుల పాటు రెస్ట్ తీసుకుని రిలాక్స్ అయిన రజినీ.. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా 2.0 షూటింగ్ కి అటెండ్ అవుతున్నారు. నవంబర్ 5న రోబో సెట్స్ లో జాయిన్ అయిన రజినీకాంత్.. ఈ సారి రెట్టించిన వేగంతో పని చేసేలా ప్లాన్ చేసుకున్నారు. ముందు నిర్ణయించిన షెడ్యూల్స కొంత డిస్టర్బ్ కావడంతో.. వాటిని కూడా కవర్ చేసేయనున్నారు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ని ఫినిష్ చేసేందుకు రజినీకాంత్ ఎంతగా ఫిక్స అయ్యారంటే..ఈ సారి సినిమాలో తన వంతు భాగం షూటింగ్ మొత్తం పూర్తయ్యే వరకూ బ్రేక్ కూడా తీసుకోరట. 350 కోట్ల రూపా యల భారీ బడ్జెట్తో రూపొందుతున్న 2.0 పై అంచనాలు చాలానే ఉన్నాయి. వీటిని అందుకునేందుకు టీమ్ మొత్తం బోలెడంత కష్టపడుతోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి.. నవంబర్ 20న ఫస్ట్ లుక్ రిలీజ్ను ముంబైలో గ్రాండ్గా ప్లాన్ చేశారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









