శివ కార్తికేయన్ తన 'రెమో' మూవీని ప్రమోట్ చేస్తూ పవన్ పై ఆ సక్తికర కామెంట్స్ ..
- November 06, 2016
యంగ్ హీరో నితిన్ నుండి సప్తగిరి వరకు ఎందరో టాలీవుడ్ హీరోలు పవన్ కళ్యాణ్ నామ జపం చేస్తూ తమ ఇమేజ్ ని పవన్ అభిమానులలో పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులో ఒక కోలీవుడ్ యంగ్ హీరో చేరడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.ఇప్పటికే కోలీవుడ్ లో హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న శివ కార్తికేయన్ త్వరలో తన 'రెమో' మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే ఈసినిమా ఆడియో ఫంక్షన్ ను అత్యంత ఘనంగా గతవారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈసినిమా ప్రమోషన్ కోసం దాదాపు 40 లక్షలు మీడియా వర్గాల పార్టీ కోసమే ఈమధ్య హైదరాబాద్ లో ఖర్చు చేసినట్లు వచ్చిన వార్తలు అందర్నీ ఆశ్చర్య పరిచాయి.ఇది చాలదు అనుకుని కాబోలు శివ కార్తికేయన్ తన 'రెమో' మూవీని ప్రమోట్ చేస్తూ పవన్ పై ఆ సక్తికర కామెంట్స్ చేసాడు. తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని చెపుతూ చెన్నైలో 'గబ్బర్ సింగ్' సినిమాను అభిమానుల మధ్య కూర్చుని ఎంజాయ్ చేసిన విషయాన్ని బయట పెట్టాడు.ఇదే సందర్భంలో ఈ యంగ్ హీరో మాట్లాడుతూ తాను పవన్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ పవన్ కోసం ఎటువంటి బ్యాగ్ గ్రౌండ్ స్కోర్ పవన్ ఇంట్రడక్షన్ సీన్ లో ఇస్తాడో అన్న ఆ శక్తితో ఎదురు చూస్తున్నానని అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. అయితే 'రెమో' సినిమాకు కూడ అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అతడి పేరును తెలివిగా పవన్ సినిమా వంకతో గుర్తుకు చేస్తూ తన 'రెమో' ఓపెనింగ్ కలక్షన్స్ కు పవన్ అభిమానుల అండ ఉండేలా చూసుకున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.ఇప్పటికే ఈ యంగ్ హీరో దిల్ రాజ్ సహకారంతో టాలీవుడ్ లో తన హవాను చాటుకోవడానికి చాల వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ఏకంగా ఇతడు పవన్ కళ్యాణ్ ఇమేజ్ పై కన్నేసి మెగా యంగ్ హీరోలు కూడ చేయని భజన పవన్ విషయంలో చేస్తున్నాడు అంటూ సెటైర్లు పడుతున్నాయి..
తాజా వార్తలు
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు







