కబాలీ రైస్
- November 07, 2016
కావలసినవి: బాస్మతి బియ్యం అర కేజి, శనగపప్పు 200 గ్రా., తరిగిన ఉల్లిపాయలు 100 గ్రా., తరిగిన పచ్చిమిర్చి 6, అల్లం-వెల్లుల్లి ముద్ద 2 టేబుల్ స్పూన్లు, కారం అర టేబుల్ స్పూను, గరం మసాలా 10గ్రా., పుదీనా ఒక కట్ట, నిమ్మకాయ ఒకటి, నెయ్యి 50 గ్రా., కుంకుమ పువ్వు చిటికెడు, నూనె 50 గ్రా., పెరుగు 2 కప్పులు ఉప్పు తగినంత.
ఎలా చేయాలి
బియ్యాన్ని శుభ్రం చేసి నీళ్లలో నానబెట్టాలి. శనగపప్పును కుక్కర్లో ఉడికించాలి. బియ్యాన్ని మూడొంతులు ఉడికించాలి. బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు వేగించాలి. పసుపు, కారం, గరం మసాలా వేసి కలపాలి. తర్వాత ఉడికిన శనగపప్పు కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బాణలిలో నెయ్యి వేడి చేయాలి. అన్నంలో సగభాగాన్ని బాణలిలో వేయాలి. దాని పైన శనగపప్పు మిశ్రమాన్ని ఈ అన్నంపైన పొరలా వేయాలి. దాని పైన మిగిలిన అన్నాన్ని కూడా వేసి కొద్దిగా నెయ్యి పోయాలి. దాని పైన నిమ్మరసాన్ని చల్లాలి. కుంకుమ పువ్వు కూడా చల్లి మొత్తమంతా కలిపి 15 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. వడ్డించే ముందు అన్నాన్ని బాగా కలపాలి. దీనిని వేడి వేడిగా తింటే బావుంటుంది.
తాజా వార్తలు
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!









