భారత్ లో భారీ విధ్వంసం సృష్టిస్తాం : హఫీజ్
- November 08, 2016
భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జరిపిన సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకొనే వ్యూహ రచన చేస్తోంది... భారత సైనిక శిబిరం పై సర్జికల్ దాడులు చేపడుతూ.. అదే సమయంలో ప్రధాన నగరాల్లో విధ్వంసానికి రెడీ అవుతోందని లష్కరే తోయబా నేత హఫీజ్ చేసిన వ్యాఖ్యలను బట్టి అర్ధం అవుతుంది. వివరాల్లోకి వెళ్తే...లష్కరే తోయబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ జమ్మూకాశ్మీర్ లోని సరిహద్దుల్లో ఉన్న సైన్యంపై త్వరలో సర్జికల్ దాడులు నిర్వహిస్తామని స్వయంగా ప్రకటించాడు. భారత్ జరిపిన మెరుపు దాడులకు ప్రతీకారంగా భారత్ ఎన్నడూ మరచిపోలేనంత దారుణంగా దాడులు చేస్తామని ప్రకటించాడు. భారత్ పై మెరుపు దాడులు చేసేలా ముజాహిదీన్(కశ్మీరీ ఉగ్రవాదులు) ప్రణాళిక రూపొందిస్తున్నట్లు జమాత్-ఉద్-దావా అధిపతి, ముంబయి ఉగ్రదాడుల సూత్రధారైన హఫీజ్ వెల్లడించాడు.. ఇప్పటికే ప్రధాన పట్టణాల్లో ఉగ్రదాడులకు లష్కరే తాయిబా వ్యూహరచన చేస్తోంది. భారత-పాక్ సరిహద్దుల వెంబడి ప్రవహిస్తున్న నిక్కీ తావి, బడి తావి నదులద్వారా దేశంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు సిద్ధమవుతున్నారు. భారతలో భారీ ఎత్తున దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టించే బాధ్యతను లష్కరే కమాండర్ అబు ఇర్ఫాన్ తండేవాలాకు సయీద్ అప్పగించినట్లు తెలుస్తోంది. ఈమేరకు భారత నిఘా సంస్థలు పక్కా సమాచారం సేకరించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







