తెలంగాణ మూడు వ దఫా రైతు రుణమాఫీ నిధులు విడుదల..
- November 08, 2016
తెలంగాణ ప్రభుత్వం మరోదఫా రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది. రూ.2019.19కోట్ల నిధులను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రెండు దశల్లో నిధులు విడుదల చేయగా ఇవి మూడో దశలో రెండో విడత రుణమాఫీ నిధులుగా ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.17వేల కోట్లు రుణాల మాఫీకి నిర్ణయం తీసుకుంది. రుణాలను నాలుగేళ్లలో చెల్లించాలని, ఏటా రూ.4250 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. దాంట్లో మొదటి ఏడాది ఒకేసారి రూ.4250 కోట్లు విడుదల చేశారు. రెండో ఏడాది నుంచి రెండు దశల్లో రుణాలను ప్రభుత్వం చెల్లిస్తోంది. గతేడాది సెప్టెంబర్ లోపే చెల్లించగా ఈ సంవత్సరం కొంత ఆలస్యమైంది.
మొదటి దఫా కింద రూ.2100కోట్లను విడుదల చేయగా మిగిలిన బకాయిలను ఈరోజు విడుదల చేసింది. మొత్తం రూ.2019.19కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. వచ్చే సంవత్సరం మాత్రం ఒకే దఫాలో జులై నెలలోనే రూ.4250కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









