తెలంగాణ మూడు వ దఫా రైతు రుణమాఫీ నిధులు విడుదల..
- November 08, 2016
తెలంగాణ ప్రభుత్వం మరోదఫా రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసింది. రూ.2019.19కోట్ల నిధులను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రెండు దశల్లో నిధులు విడుదల చేయగా ఇవి మూడో దశలో రెండో విడత రుణమాఫీ నిధులుగా ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం మొత్తం రూ.17వేల కోట్లు రుణాల మాఫీకి నిర్ణయం తీసుకుంది. రుణాలను నాలుగేళ్లలో చెల్లించాలని, ఏటా రూ.4250 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. దాంట్లో మొదటి ఏడాది ఒకేసారి రూ.4250 కోట్లు విడుదల చేశారు. రెండో ఏడాది నుంచి రెండు దశల్లో రుణాలను ప్రభుత్వం చెల్లిస్తోంది. గతేడాది సెప్టెంబర్ లోపే చెల్లించగా ఈ సంవత్సరం కొంత ఆలస్యమైంది.
మొదటి దఫా కింద రూ.2100కోట్లను విడుదల చేయగా మిగిలిన బకాయిలను ఈరోజు విడుదల చేసింది. మొత్తం రూ.2019.19కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. వచ్చే సంవత్సరం మాత్రం ఒకే దఫాలో జులై నెలలోనే రూ.4250కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







