జయమ్ము నిశ్చయమ్మురా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి..
- November 08, 2016
ఓ చిన్న సినిమా పాజిటివ్ టాక్ తో రిలీజ్ కావడం చాలా అరుదు. కమెడియన్ శ్రీనివాస్ 'జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రం ఆ అరుదైన చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో పూర్ణ హీరోయిన్. శివరాజ్ కనుమూరి దర్శకుడు. ఫస్ట్ లుక్ నుంచే ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా జరిగిపోయింది. ఈ నెల 13న ఆడియో విడుదల కానుండగా. 24న ఈ చిత్రం ప్రేక్షకుల రానుంది.తాజాగా, 'జయమ్ము నిశ్చయమ్మురా' సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ని జారీ చేసింది. సెన్సార్ బోర్డ్ ఫీల్ గుడ్ మూవీ చూశామనే కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది.తత్కాల్ ప్రవీణ్ అంటూ కమెడియన్ ప్రవీణ్, అడపా ప్రసాద్ గా కృష్ణ భగవాన్ పాత్రలు చేసిన కామెడీ అద్భుతంగా పండాయట. శ్రీనివాస్ రెడ్డి పాత్రని మలిచిన తీరు చాలా బాగుందంటున్నారు. మొత్తానికి శ్రీనివాస్ రెడ్డి ఖాతాలో మరో విజయం చేరడం ఖాయమన్నది సెన్సార్ టాక్.
ఈ నెల 13న ఈ చిత్రం ఆడియో కార్యక్రమం జరగనుంది. ఈ ఆడియో వేడుకకి స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నాడట. ఇదే జరిగితే.. ఈ చిత్రంపై మరిన్ని అంచనాలు పెరిగిపోవడం ఖాయం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







