పాకిస్తాన్ 20-20 క్రికెట్ లీగ్ కి అతిధ్యమివ్వనున్న ఖతార్
- August 27, 2015
ఒక చారిత్రాత్మక ప్రారంభానికి చిహ్నంగా, వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లో జరగనున్నమిలియన్ డాలర్ల పాకిస్తాన్ సూపర్ 20-20 లీగ్ మేచ్ కు అతిధ్యమివ్వడం ద్వారా కతార్ క్రికెట్ కోసం పడిగాపులు పడుతూ ఉన్న అభిమానుల దాహాన్ని తీర్చనుంది. ప్రపంచంలోనే మేటి ఆటగాళ్లను, వారి ఆటను కళ్ళారా చూడడానికి అభిమానులు కేరింతలు కొడుతున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ నజమ్ సేథి ఈ మేచ్లు 2016 ఫిబ్రవరి 4 నుండి 24 మధ్య జరగనున్నట్టు ప్రకటించారు. ప్రపంచస్థాయి క్రికెట్ కు అతిధ్యమిచ్చే గల్ఫ్ దేశాల్లో షార్జా మొదటిది కాగా, అనంతరం దుబాయి, అబుధాబీ కూడా ఈ వరుసలో చేరాయి; ఇపుడు దోహా కూడా వాటి సరసన సగర్వంగా నిలచి క్రికెట్ లోకంలో తారగా తళుకులీననుంది!
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







