బ్యాంకులు, పోస్టాఫీసుల్లోరూ.500 నోట్లు, రూ.1000 మార్చుకోవడానికి గుర్తింపు పత్రాలు తప్పనిసరి..
- November 08, 2016
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం తమ వద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్లను ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారు.నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా, రూ.500 నోట్లు, రూ.1000 నోట్లు మంగళవారం అర్థరాత్రి నుంచి చలామణిలో ఉండవని మోడీ ప్రకటించిన విషయం తెల్సిందే.ఈ నేపథ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల్లో వీటిని మార్చుకోవడానికి గుర్తింపు పత్రాలు తప్పనిసరి చేశారు.పాన్ కార్డు, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడిలలో ఏదో ఒకటి తప్పనిసరిగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చూపించి మాత్రమే ఈ నోట్లను మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ గుర్తింపు కార్డులు లేకుండా పాత నోట్లను మార్చుకోవడం కుదరదు. అందువల్ల నల్లధనం దాచుకున్న వ్యక్తులు కట్టల కొద్దీ రూ.500 నోట్లు, రూ.1000 నోట్లను మార్చుకోవడం అంత తేలికకాదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







