భవనాలకు స్మార్ట్ మీటర్స్
- November 09, 2016
దోహా: కొత్త ప్రాజెక్టులు, మరియు బిల్డింగులు ఇకపై స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లను కలిగి ఉండనున్నాయి. పాత మీటర్లను కొత్త మీటర్లతో దశల వారీగా మార్చుతారు. ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. స్మార్ట్ మీటర్స్ ద్వారా మీటర్ రీడింగ్స్ ఎనర్జీ సప్లయర్కి ఖచ్చితత్వంతో అందిస్తాయని, వినియోగదారుకూ ఈ విధానం ద్వారా తాము వినియోగించే ఎనర్జీపై ఖచ్చితమైన సమాచారం ఉంటుందని ఆయన తెలిపారు. 15,000 మీటర్లను ఇప్పటికే సప్లయ్ చేసినట్లు ఆయన చెప్పారు. 2020 నాటికి 200 నుంచి 500 మెగా వాట్స్ సోలార్ ఎనర్జీని ఖతార్ తయారు చేయగలదని కరామా ప్రెసిడెంట్ ఇంగ్ ఇస్సా బిన్ హిలాల్ అల్ కువారి చెప్పారు. 2012లో ప్రారంభించిన తర్షీద్ ఎలక్ట్రిసిటీ కంజంప్షన్ని 14 శాతం వరకు తగ్గించిందనీ, వాటర్ కంజంప్షన్ని 15 శాతం తగ్గిందని ఆయన వివరించారు. వృధాని అరికట్టడం అలాగే ఖచ్చితత్వంతో కూడిన బిల్లులతో వినియోగదారులకు సేవలందించడం తమ లక్ష్యమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







