రానున్న 'రఘువరన్ బీటెక్' సీక్వెల్
- November 09, 2016
ధనుష్ కథానాయకుడిగా 2014లో విడుదలై ఘన విజయం సాధించిన 'రఘువరన్ బీటెక్' చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుంది. తెలుగులో ఈ చిత్రాన్ని 'వీఐపీ 2' అనే టైటిల్తో విడుదల చేస్తున్నట్లు ధనుష్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ప్రకటించారు. డిసెంబరులో చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుపుతూ. పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. ఈ చిత్రానికి కథ-డైలాగ్స్ ధనుష్, దర్శకత్వం-స్క్రీన్ప్లే సౌందర్య రజనీకాంత్. కథానాయిక, మిగిలిన చిత్ర బృందం సమాచారం తెలియాల్సి ఉంది. 'రఘువరన్ బీటెక్' చిత్రానికి వేల్రాజ్ దర్శకత్వం వహించారు. నిరుద్యోగిగా ఉన్న గ్రాడ్యుయేట్ విద్యార్థి ఎలా సక్సెస్ఫుల్ సివిల్ ఇంజనీర్ అయ్యారనే కథతో నిర్మించిన ఈ చిత్రంలో అమలాపాల్ కథానాయికగా నటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







