ట్రంప్ మధ్య ప్రాచ్యంలో స్థిరత్వం కోసం కృషి చేస్తారని సౌదీ రాజు ఆశాభావం
- November 10, 2016
రియాద్ : అమెరికా తదుపరి అధ్యక్షులుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్కు సౌదీ రాజు సల్మాన్ బుధవారం ఒక సందేశం ద్వారా అభినందనలు తెలిపారు. నూతన అధ్యక్షుడు మధ్య ప్రాచ్యంలో స్థిరత్వం సాధించడానికి కృషి చేస్తారని సౌదీ రాజు ఆశాభావం వ్యక్తం చేస్తూ అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ ద్వారా నివేదించారు. ఇరు దేశాల సంబంధాలు మరింతగా అత్యున్నత స్థాయికి వెళ్లేందుకు ట్రంప్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సౌదీ రాజు సల్మాన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉండే సంబంధాలను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. చారిత్రక మరియు పటిష్టమైన స్నేహపూర్వక విధానాలు రెండు దేశాల మధ్య అభివృద్ధి మరియు గట్టిగా బలోపేతం కావాలని ఆయన కోరుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా కు మరియు సౌదీ అరేబియా దేశాల మధ్య సౌదీ చమురు, అమెరికన్ భద్రతా మార్పిడి ఆధారంగా ఒక దశాబ్దాల కాలంగా బలమైన సంబంధం కలిగి ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో గత ఎనిమిది సంవత్సరాల డెమోక్రటిక్ పరిపాలన సమయంలో రియాద్ వాషింగ్టన్ మధ్య సంబంధాలు భయపెట్టిన తీరులో మారిందని సౌదీ రాజు గుర్తు చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









