ట్రంప్ మధ్య ప్రాచ్యంలో స్థిరత్వం కోసం కృషి చేస్తారని సౌదీ రాజు ఆశాభావం
- November 10, 2016
రియాద్ : అమెరికా తదుపరి అధ్యక్షులుగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్కు సౌదీ రాజు సల్మాన్ బుధవారం ఒక సందేశం ద్వారా అభినందనలు తెలిపారు. నూతన అధ్యక్షుడు మధ్య ప్రాచ్యంలో స్థిరత్వం సాధించడానికి కృషి చేస్తారని సౌదీ రాజు ఆశాభావం వ్యక్తం చేస్తూ అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ ద్వారా నివేదించారు. ఇరు దేశాల సంబంధాలు మరింతగా అత్యున్నత స్థాయికి వెళ్లేందుకు ట్రంప్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సౌదీ రాజు సల్మాన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉండే సంబంధాలను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. చారిత్రక మరియు పటిష్టమైన స్నేహపూర్వక విధానాలు రెండు దేశాల మధ్య అభివృద్ధి మరియు గట్టిగా బలోపేతం కావాలని ఆయన కోరుకున్నారు. యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా కు మరియు సౌదీ అరేబియా దేశాల మధ్య సౌదీ చమురు, అమెరికన్ భద్రతా మార్పిడి ఆధారంగా ఒక దశాబ్దాల కాలంగా బలమైన సంబంధం కలిగి ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో గత ఎనిమిది సంవత్సరాల డెమోక్రటిక్ పరిపాలన సమయంలో రియాద్ వాషింగ్టన్ మధ్య సంబంధాలు భయపెట్టిన తీరులో మారిందని సౌదీ రాజు గుర్తు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







