ట్రంప్కు యూఎస్ఐబీసీ సూచన...
- November 10, 2016
అమెరికా అధ్యక్ష పదవిని దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్కు అక్కడి టాప్ బిజినెస్ అడ్వైజరీ గ్రూప్.. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ఐబీసీ) సలహాలు, సూచనలు చేసింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికాకు ఆహ్వానించాలని సూచించింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం పట్ల శుభాకాంక్షలు తెలుపుతూ యూఎస్ఐబీసీ ఆయనకు లేఖ రాసింది. ఈ లేఖలో మోదీని అమెరికాకు ఆహ్వానించాలని పేర్కొంది.వైట్హౌస్లోకి వెళ్లిన ఏడాదిలోపే మోదీని ఆహ్వానిస్తే..ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాధాన్యాన్ని స్పష్టం చేసినట్లవుతుందని యూఎస్ఐబీసీ అధ్యక్షుడు ముకేశ్ తెలిపారు. కొత్త వైట్హౌస్ అడ్మినిస్ట్రేషన్ తొలి నెలలో చేయాల్సిన పనులను లేఖలో సూచించారు. వీటి ద్వారా భారత్, అమెరికాల మధ్య సత్సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలుబలోపేతమవుతాయన్నారు. ట్రంప్ బుధవారం అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









