ట్రంప్కు యూఎస్ఐబీసీ సూచన...
- November 10, 2016
అమెరికా అధ్యక్ష పదవిని దక్కించుకున్న డొనాల్డ్ ట్రంప్కు అక్కడి టాప్ బిజినెస్ అడ్వైజరీ గ్రూప్.. యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ఐబీసీ) సలహాలు, సూచనలు చేసింది. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికాకు ఆహ్వానించాలని సూచించింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం పట్ల శుభాకాంక్షలు తెలుపుతూ యూఎస్ఐబీసీ ఆయనకు లేఖ రాసింది. ఈ లేఖలో మోదీని అమెరికాకు ఆహ్వానించాలని పేర్కొంది.వైట్హౌస్లోకి వెళ్లిన ఏడాదిలోపే మోదీని ఆహ్వానిస్తే..ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాధాన్యాన్ని స్పష్టం చేసినట్లవుతుందని యూఎస్ఐబీసీ అధ్యక్షుడు ముకేశ్ తెలిపారు. కొత్త వైట్హౌస్ అడ్మినిస్ట్రేషన్ తొలి నెలలో చేయాల్సిన పనులను లేఖలో సూచించారు. వీటి ద్వారా భారత్, అమెరికాల మధ్య సత్సంబంధాలు, వాణిజ్య ఒప్పందాలుబలోపేతమవుతాయన్నారు. ట్రంప్ బుధవారం అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







