భారతీయ దంపతుల ఆత్మహత్యాయత్నం... భర్త మృతి, చికిత్స పొందుతున్న భార్య
- November 10, 2016
దుబాయ్: ఒక భారతీయ దంపతులు తమ జీవితాలను అంతం చేసుకోవడానికి ప్రయత్నించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆత్మహత్యాయత్నానికి ముందు వారి కుమారులను వేరే ప్రాంతానికి పంపిన తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టారు. భారతదేశానికి చెందిన ఒక వ్యాపారవేత్త చనిపోయినట్లు దుబాయ్ లో బుధవారం మధ్యాహ్నం వారి అపార్ట్మెంట్ వద్ద కనుగొన్నారు. ఈ భార్యభర్తలు అనుమానిత ఆత్మాహుతి ఒడంబడిక తర్వాత భర్త చనిపోగా, భార్య చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరారు.అడ్వర్టైజింగ్ సంస్థ యజమాని వి. కుమార్ కాగా ,ఆయన సతీమణి సైతం వెండి ఆభరణాలు అమ్మే దుకాణం నిర్వహించేది. వీరు ఇరువురు ఆత్మహత్య చేసుకోవాలని ముందుగానే ఒక ప్రణాళిక రచించి అందులో భాగంగా తన భార్య, వారి ఇద్దరు యువ కుమారులను బంధువుల ఇంటికి పంపినట్లు వారి ఇంటి పొరుగువారు " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు. అదేవిధంగా ఈ దంపతులు కొన్ని రోజుల క్రితమే వారి ఇంట్లో పని చేసే వ్యక్తిని సైతం వేరే చోటుకి పంపారని , అదేవిధంగా వారి పిల్లలలను కొన్ని రోజులుగా పాఠశాలకు పంపించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఆర్థిక సమస్యలు తీవ్రమవడంతో వారు ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రేరేపించాయిమోనని కొందరు అనుమానిస్తున్నారు.
అస్పష్టంగా పద్ధతి -
ఆంధ్ర ప్రదేశ్ నుండి ఇక్కడకు వచ్చి అనూహ్యంగా ప్రాణాలు పోగొట్టుకొన్నఈ జంట, కరమ లో ఉమ్మె హురైర భవనంలో నాలుగో అంతస్తుల అపార్ట్మెంట్ లో వారి జీవితాలను అంతం చేసుకొనేందుకు ప్రయత్నించారు. వీరు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డారో ఇంతవరకు ఎటువంటి స్పష్టమైన సమాచారం తెలియడం లేదు. "నేను స్కూల్ బస్సు నుండి నా కుమారుడిని తీసుకొని పై అంతుస్తులోనికి అడుగు పెట్టినపుడు నేను ఆశ్చర్యకరమైనవి వార్తలు విన్నప్పుడు దిగ్బ్రాంతికి గురయ్యాను " ఒక భారతీయ మహిళ తమతో పాటు భవనంలో నివసిస్తున్నట్లు చెప్పారు. " పొరుగున ఈ విషాద సంఘటన జరగడం నిజంగా ఒక షాక్ కల్గించే వార్త అని దీనిపై ఎంతో విచారంగా ఉన్నామని అన్నారు. వారి కుమారులు మా పిల్లలతో ఆడటానికి వస్తారని ఆమె బాధపడ్డారు. కుమార్ భార్య సజీవంగా దొరకడంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. వీరు ఆత్మహత్య చేసుకొన్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి రాకపోవడంతో వారి పరిస్థితి ప్రమాదకరంగా మారిందని స్థానికులు వ్యాఖ్యలు చేస్తున్నారు. కుమార్ లో సంస్థ లో తొమ్మిదేళ్లుగా పనిచేస్తున్నఒకానొక ఉద్యోగి ఈ విధంగా తెలిపారు "కుమార్ గారు మంగళవారం విధులకు హాజరు కాలేదని, అయితే ఉద్యోగులకు ఏ భారీ ఆర్థిక సమస్యలు లేవని వారి జీతాలు కొన్ని నెలల క్రితం కొద్దిగా ఆలస్యంగా వచ్చేవారని చెప్పారు. కుమార్ దంపతుల కుమారులు కేవలం10 ఏళ్ళ వయస్సు, ఆరు సంవత్సరాల వయస్సులని వారిని 'ఇంటర్నేషనల్ సిటీ' లోని బంధువుల ఇంటికి పంపారని తెలిపారు. వారు ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమై ఉంటుందో తెలియదు. నేను నిజంగా కలతచెందుతున్నామని అన్నారు."
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







