జపాన్ తో భారత్ అణు ఒప్పందం.!
- November 11, 2016
ప్రధాని నరేంద్రమోదీ జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారత్, జపాన్ మధ్య అణు ఒప్పందం కుదిరింది. అనంతరం మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి మద్దతు తెలిపిన జపాన్కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. జపాన్తో పౌర అణు ఒప్పందం చరిత్రాత్మకమైనదని అభివర్ణించారు. జపాన్తో పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశం భారత్ అని తెలిపారు. ఇరు దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పోరాడుతాయని స్పష్టం చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల ఇరుదేశాల్లో శాంతి, సమన్వయం, స్థిరత్వం నెలకొంటాయన్నారు. భారత్, జపాన్ సహజ భాగస్వామ్య దేశాలని మోదీ పేర్కొన్నారు. పెట్టుబడులు, తయారీ రంగాలకు భారత్ ప్రధాన కేంద్రం కావాలన్నదే తమలక్ష్యమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









