జపాన్ తో భారత్ అణు ఒప్పందం.!
- November 11, 2016
ప్రధాని నరేంద్రమోదీ జపాన్ పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారత్, జపాన్ మధ్య అణు ఒప్పందం కుదిరింది. అనంతరం మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి మద్దతు తెలిపిన జపాన్కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. జపాన్తో పౌర అణు ఒప్పందం చరిత్రాత్మకమైనదని అభివర్ణించారు. జపాన్తో పౌర అణు ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశం భారత్ అని తెలిపారు. ఇరు దేశాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి పోరాడుతాయని స్పష్టం చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల ఇరుదేశాల్లో శాంతి, సమన్వయం, స్థిరత్వం నెలకొంటాయన్నారు. భారత్, జపాన్ సహజ భాగస్వామ్య దేశాలని మోదీ పేర్కొన్నారు. పెట్టుబడులు, తయారీ రంగాలకు భారత్ ప్రధాన కేంద్రం కావాలన్నదే తమలక్ష్యమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







