మార్చిలో ప్రారంభంకానున్న కార్తీ, మణిరత్నం సినిమా
- November 11, 2016
కార్తీ, అదితిరావు హైదరి జంటగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న రొమాంటిక్ డ్రామా 'కాట్రు వెలియిడై'. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు కార్తీ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను అభిమానులతో పంచుకున్నారు. మద్రాస్ టాకీస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. రవివర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా శ్రీకర్ ప్రసాద్ సినిమా ఎడిటింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. రుక్మిణీ విజయకుమార్, శ్రద్ధా శ్రీనాథ్, ఆర్జే బాలాజీ, దిల్లీ గణేశ్, విపిన్ శర్మ తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.ఈ పోస్టర్లో కార్తీ, అదితి హైదరీతో పాటు రెండు జెట్ విమానాలు కూడా ఉన్నాయి. మణిరత్నం చిత్రాలు వాస్తవికతకు దగ్గరగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్ర కథ గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కానీ పోస్టర్ను చూస్తుంటే విభిన్న కథాంశంతోనే మణిరత్నం చిత్రాన్ని తెరకెక్కిస్తున్న కోలీవుడ్ సమాచారం.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







