ఊపిరి తిత్తుల వ్యాధులకు ప్రొద్దు తిరుగుడు గింజలే దివ్య ఔషధం..!
- November 11, 2016
ఊపిరి తిత్తుల వ్యాధులతో బాధపడేవారికి ప్రొద్దు తిరుగుడు గింజలతో చేసిన కషాయము అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. అయితే ప్రొద్దు తిరుగుడు చేదు, వగరు, కారం రుచులతో వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది. శరీరంలోని కఫరోగాలను పిత్త రోగాలను, శ్వాసరోగాలను, జ్వరాలను, చర్మరోగాలను, ప్రమేహాలను రక్తదోషాలను హరిస్తుంది.
అలాగే జీర్ణశక్తి లోపించిన వారు ప్రొద్దు తిరుగుడు గింజల తైలమును ప్రతిరోజూ తగినంత మోతాదులో సేవిస్తే జీర్ణశక్తి అభివృద్ధి చెందుతుంది. ప్రొద్దు తిరుగుడు చెట్టు ఆకులను నీడలలో ఎండించి చూర్ణం చేసి ఒక కప్పు పెరుగులో అర్థ చెంచా పొడిని వేసి దానిలో అర్థ కప్పు దానిమ్మ పండు రసం కలిపి చారు కాచినట్లు వేడి చేసి దించి రెండు మూడు చెంచాల నెయ్యి చేర్చి దించి రెండు పూటలా త్రాగుతుంటే ఆమ్లముతో (మురిగిన మలపదార్థములతో ) కడుపు నొప్పితో కూడి వేదించే ఆమ్ల విరేచనాలు త్వరగా తగ్గిపోతాయి.
ప్రొద్దు తిరుగుడు చెట్టు ఆకులు, పొట్ల చెట్టు ఆకులు ఈ రెండింటిని కలిపి ఆకుకూరలాగా వండి రెండు పూటలా తింటుంటే శరీరంలో చేరిక అధికమైన చెడు నీరు హరించి పోయి ఉబ్బురోగం హరించిపోతుంది.
ప్రొద్దు తిరుగుడు చెట్టు ఆకులు పొడి అర్థ చెంచా మోతాదుగా ఒక కప్పు వేడి పాలలో వేసి దానిలో ఒక చెంచా ఆవు నెయ్యి నాలుగు చెంచా త్రికటు చూర్ణం మిరియాలు సమంగా కలిపి నూరిన చూర్ణం కలిపి రెండు పూటలా సేవిస్తే దగ్గు, దమ్ము ఆయాసం, తగ్గిపోతాయి.
ప్రొద్దు తిరుగుడు చెట్టు వేరు బియ్యం కడిగిన నీటితో నూరి గంధం లాగా అరగదీసి ఆ గంధం ఒక టీస్పూను మోతాదుగా ఒక ఒక కప్పు బియయం కడిగిన నీటిలో కలిపి రెండు పూటలా సేవిస్తుంటే స్త్రీల సమస్యలు నివారణమవుతాయి.
తేలు కుట్టిన వెంటనే ప్రొద్దు తిరుగుడు చెట్టు ఆకును మెత్తగా నూరి రెండు ముక్కులతో బాగా వాసన చూడాలి. వాసన చూసిన తర్వాత మరుక్షణమే తేలు విషం నశించిపోయి నొప్పి, బాధ మంట వెంటనే తగ్గిపోతాయి. ప్రొద్దు తిరుగుడు చెట్టును సమూలంగా మెత్తగా దంచి ఆ ముద్దను రాత్రి నిదురించేఏ ముందు కాలి పగుళ్లపైన పట్టిస్తుంటే పగుళ్ళు పుండ్లు పూర్తిగా తగ్గిపోయి పాదాలు ప్రకాశవంతంగా ఆరోగ్యవంతంగా తయారవుతాయి.
తాజా వార్తలు
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు







