పెద్దనోట్ల రద్దు వల్ల ట్రాఫిక్ రూల్స్ కి అంతరాయం
- November 12, 2016
పెద్దనోట్లు చెల్లకపోవడంతో కేసులు నమోదుచేయడాన్ని ట్రాఫిక్ పోలీసులు తగ్గించారు. రూ.500, రూ.1,000 నోట్లు చెల్లని కారణంగా ప్రజల వద్ద నగదు కొరత ఏర్పడింది. రోజువారీ ఖర్చులకు కూడా ప్రజలు కష్టపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చెన్నైలో ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేయడం తగ్గించారు. ఇదివరకు ప్రతిరోజు 15 వేల కేసులకు పైగా నమోదుచేస్తుండగా, గత మూడు రోజుల నుంచి 2 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి నేరాలకు మాత్రమే కేసులు నమోదుచేస్తూ.. వాహనాల దస్తావేజులు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం తదితరాలను చూసిచూడనట్లు వదిలేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నగదు కొరత తీరిన తర్వాత యథావిధిగా కేసులు నమోదుచే యనున్నట్లు ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









