పెద్దనోట్ల రద్దు వల్ల ట్రాఫిక్ రూల్స్ కి అంతరాయం
- November 12, 2016
పెద్దనోట్లు చెల్లకపోవడంతో కేసులు నమోదుచేయడాన్ని ట్రాఫిక్ పోలీసులు తగ్గించారు. రూ.500, రూ.1,000 నోట్లు చెల్లని కారణంగా ప్రజల వద్ద నగదు కొరత ఏర్పడింది. రోజువారీ ఖర్చులకు కూడా ప్రజలు కష్టపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చెన్నైలో ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేయడం తగ్గించారు. ఇదివరకు ప్రతిరోజు 15 వేల కేసులకు పైగా నమోదుచేస్తుండగా, గత మూడు రోజుల నుంచి 2 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి నేరాలకు మాత్రమే కేసులు నమోదుచేస్తూ.. వాహనాల దస్తావేజులు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, హెల్మెట్ ధరించకపోవడం తదితరాలను చూసిచూడనట్లు వదిలేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నగదు కొరత తీరిన తర్వాత యథావిధిగా కేసులు నమోదుచే యనున్నట్లు ఓ ట్రాఫిక్ పోలీసు అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి







