ఆంగ్లపడం చిత్రం ఈ నెల 25న విడుదల....
- November 13, 2016
నటుడు రాంకీ చాలా కాలం తరువాత కథానాయకుడిగా నటించిన చిత్రం ఆంగ్లపడం. ఆయనతో పాటు సంజీవ్ మరో కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో నటి మీనాక్షి, శ్రీజ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్య పాత్రల్లో సింగంపులి, సింగముత్తు, మధుమిత నటించారు. ఆర్జే. మీడియా క్రియేషన్స పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా నవ దర్శకుడు కుమరేశ్కుమార్ పరిచయం అవుతున్నారు. ఎంసీ.గిరీశ్ సం గీతాన్ని, సాయిసతీష్ ఛాయాగ్రహణాన్ని అం దించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదలకు ముస్తాబవుతోంది.ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ హా లీవుడ్ చిత్రాల తరహాలో అనూహ్య కథ, కథనాలతో చిత్రం జెట్ స్పీడ్లో సాగుతుం దని, అందుకే దీ నికి ఆంగ్లపడం అన్న టైటిల్ను నిర్ణయించి నట్లు తెలిపారు.నిజం చెప్పాలంటే ఈ చిత్ర కథను చాలా మంది నటులకు చెప్పానన్నారు.అయితే వారంతా చాలా బాగుందని, నువ్వు చెప్పినట్లు చిత్ర కథను తెరకెక్కించగలవా అన్న సందేహాన్ని వ్యక్తం చేశారన్నారు. ఆ తరువాత రాంకీ, సంజీవ్ నటించడానికి ముందుకు వచ్చారని చెప్పారు. ఇంతకు ముందెప్పుడూ చూడని రాంకీని ఈ చిత్రంలో చూడనున్నారని తెలిపారు. అదే విధంగా తమిళ తెరకు ఆంగ్లపడం చాలా కొత్తగా ఉంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్జెట్లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!









