పూరి, వినాయక్ ల దర్శకత్వం లో నటించనున్న సాయి ధరమ్ తేజ్
- November 14, 2016
మెగాహీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం తన అప్ కమింగ్ మూవీలతో ఫుల్ బిజీగా ఉన్నారు. కెరీర్ ప్రారంభంలో తన మొదటి మూవీతో ఇబ్బంది పడ్డ సాయిధరమ్ తేజ్, తరువాత మాత్రం జెడ్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడనే చెప్పాలి. ఎందుకంటే సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ఉన్న మెగాహీరోల కంటే ఎక్కువుగా చిత్రాలలో నటిస్తున్నాడు. అలాగే తన మూవీలను ఒకే సంవత్సరంలో కనీసం 2, 3 చిత్రాల వరకూ రిలీజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం మెగాహీరోలలో ఒక్క సాయిధరమ్ తేజ్ మాత్రమే ఈ విధంగా ఎక్కవ మూవీలను చేస్తున్నాడని చెప్పాలి. ఇదిలాఉంటే తాజాగా సాయిధరమ్ తేజ్ కి గోల్డెన్ ఛాన్స్ వచ్చిందని అంటున్నారు. వీటి వివరాలను చూస్తే...వరుస విజయాలతో తన స్థాయిని పెంచుకున్న సాయిధరమ్ తేజ్..ప్రస్తుతం 'విన్నర్' అనే కమర్షియల్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై సాయిధరమ్ తేజ్ భారీ అశలు పెట్టుకున్నారు.
ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఇదిలా ఉంటే సాయిధరమ్ తేజ్ త్వరలోనే ఇద్దరు ప్రముఖ డైరెక్టర్స్ తో నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఒకటి వినాయక్ దర్శకత్వంలో...రెండోవది పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించనున్నారని అంటున్నారు. సాయిధరమ్ తేజ్ లోని మాస్ యాంగిల్ వీరిద్దరికీ తెగ నచ్ఛటంతో...పూరీ, వినాయక్ లు సాయిధరమ్ తేజ్ కోసమే ప్రత్యేకమైన కథలను రాసుకున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు బయటకు రానున్నాయని అంటున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సాయిధరమ్ తేజ్ నటించారంటే...అది కచ్ఛితంగా సాయిధరమ్ తేజ్ కి బంపర్ ఆఫర్స్ ని చెప్పవచ్చు. ఇక సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న విన్నర్ మూవీ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఫిబ్రవరి 24, 2017న విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









