బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలలకు అవార్డులు ..

- November 14, 2016 , by Maagulf
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలలకు అవార్డులు ..

టీనేజ్‌ పారాలింపిక్‌ స్విమ్మర్‌ కుమారి రేవతి నాయక్‌, చెస్‌ క్రీడాకారుడు దేవ్‌ షా.. నేషనల్‌ చైల్డ్‌ అవార్డులు అందుకున్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతులమీదుగా వీరు ఈ అవార్డులు అందుకున్నారు. మ్యూజిక్‌, స్పోర్ట్స్‌, ఆర్ట్స్‌, నూతన ఆవిష్కరణలు, చదువు విభాగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన మొత్తం 31 మంది బాలలకు ఈ అవార్డులను అందజేశారు.16ఏళ్లకే స్విమ్మింగ్‌లో అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తున్నందుకుగాను నాయక్‌కు బంగారు పతకాన్ని అందించారు. అలాగే చెస్‌లో ప్రతిభ కనబరుస్తున్న తొమ్మిదేళ్ల దేవ్‌ షాకు ఎక్స్‌లెన్స్‌ అవార్డును అందజేశారు.రాజీవ్‌ గాంధీ మానవ్‌ సేవ అవార్డును బిహార్‌కు చెందిన దేవేష్‌నాథ్‌ దీక్షిత్‌, ఝార్ఖండ్‌కు చెందిన బందన కుమారి, కేరళకు చెందిన ఎస్‌. ఏసు అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీ తదితరులు హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com