తెలంగాణ లో డిజిటల్ క్లాసులు ప్రారంభించిన కేటీఆర్
- November 16, 2016
తెలంగాణ డిజిటల్ క్లాస్ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం మనటీవీ సాఫ్ట్నెట్ స్టూడియోలో మంత్రులు కడియం శ్రీహరి, కేటీఆర్ డిజిటల్ క్లాస్ ప్రసారాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ తెలంగాణ విద్యాశాఖ మరో మైలురాయిని అధిగమించిందన్నారు. 5,415 ఉన్నత పాఠశాలలకు 3,352 పాఠశాల్లో డిజిటల్ క్లాసులు నిర్వహిస్తారని తెలిపారు. దశలవారీగా ప్రభుత్వ పాఠశాల్లో ల్యాబ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ విద్యార్థులు చదువుల్లో ముందుండాలన్నదే తమ ఆకాంక్ష అని స్పష్టం చేశారు. డిజిటల్ క్లాసులను టీచర్లు వినియోగించుకోవాలని కడియం శ్రీహరి సూచించారు. మధ్యతరగతి వర్గాలకు ఐటీ ఫలితాలు అందాలన్నదే తమ ప్రయత్నం అని మరో మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ విప్లవం కొనసాగుతోందన్నారు. మిషన్ భగీరథ పైప్లైన్తో పాటు ఫైబర్ ఆప్టికల్ లైన్లు వేస్తామని, ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్తో పాటు ఇంటర్నెట్ కూడా అందాలని తెలిపారు. కుటుంబంలో ఒక్కరైనా డిజిటల్ అక్షరాస్యులు కావాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







