ఫూల్ కాజా
- August 29, 2015
కావలిసిన పదార్ధాలు
మైదాపిండి - ఒకటిన్నర కప్పు
నెయ్యి - రెండు స్పూన్లు
బెల్లంతురుము - కప్పు
యాలకుల పొడి - సరిపడా
తయారు చేసే విధానం
బెల్లం తురుములో కప్పు నీళ్లు పోసి వేడి చేస్తూ కరిగించి చల్లారనివ్వాలి. మైదాపిండిలో నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి. తరువాత బెల్లం కరిగించిన నీళ్లు పోసి బాగా కలపాలి. పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా చేయాలి. ఇప్పుడు నాలుగు చపాతీలను ఒకదాని మీద ఒకటి పెట్టి చాపలా చుట్టాలి. ఈ చాప చుట్టల్ని రెండు లేదా మూడు అంగుళాల పొడవునా కోసి కాసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు వీటిని నూనెలో వేయించి, తీసి పిస్తా పప్పు చల్లితే కరకరలాడుతూ రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









