'రోబో 2' తో బిజీ అయిపోయిన దర్శకుడు 'శంకర్'
- August 29, 2015
ఐ తరువాత ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తాడోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇండస్ట్రీకి, ఓ పెద్ద షాక్ ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ రోబోకి సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నాడు శంకర్. కలెక్షన్స్ విషయంలో రోబో వన్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. దీంతో అప్పట్లోనే రోబోకి సెకండ్ పార్ట్ ఉంటుందని ఎనౌన్స్ చేశాడు శంకర్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నాడట శంకర్. శంకర్ రోబో 2 ని స్టార్ట్ చేయడం ఒక విశేషమైతే, ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్ ముందుకి రావడం మరో విశేషం. ఐ మూవీ ఆడియో ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా ఆర్నాల్డ్ ఎంటరైన సంగతి తెలిసిందే. అంతేకాదు శంకర్ డైరెక్షన్ లో నటిస్తానని కూడా ఆర్నాల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తాజాగా రోబో 2 లో కనిపించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. అయితే ఈ హాలీవుడ్ హీరో రోబో 2 లో ఎలాంటి గెటప్ లో కనిపించబోతున్నాడనేదే ఇండస్ట్రీకి ఇప్పుడు మిలియన్ డాలర్స్ క్వశ్చిన్. ఇది ఇలా ఉంటే ఈ విషయం పై రీసెంట్ గా కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆర్నాల్డ్ తన ఓన్ ఫ్రాంఛైజ్ అయిన టెర్మీనేటర్ గెటెప్ లోనే కనిపించబోతున్నాడట. మరి మన కోలీవుడ్ రోబోతో ఆ హాలీవుడ్ టెర్మీనేటర్ ఎలా పోటీపడతాడో వేచిచూడాలి.
తాజా వార్తలు
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్







