'రోబో 2' తో బిజీ అయిపోయిన దర్శకుడు 'శంకర్'
- August 29, 2015
ఐ తరువాత ఎలాంటి ప్రాజెక్ట్ చేస్తాడోనని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇండస్ట్రీకి, ఓ పెద్ద షాక్ ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ రోబోకి సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నాడు శంకర్. కలెక్షన్స్ విషయంలో రోబో వన్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. దీంతో అప్పట్లోనే రోబోకి సెకండ్ పార్ట్ ఉంటుందని ఎనౌన్స్ చేశాడు శంకర్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నాడట శంకర్. శంకర్ రోబో 2 ని స్టార్ట్ చేయడం ఒక విశేషమైతే, ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు హాలీవుడ్ స్టార్ హీరో ఆర్నాల్డ్ ష్వాజ్ నెగ్గర్ ముందుకి రావడం మరో విశేషం. ఐ మూవీ ఆడియో ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా ఆర్నాల్డ్ ఎంటరైన సంగతి తెలిసిందే. అంతేకాదు శంకర్ డైరెక్షన్ లో నటిస్తానని కూడా ఆర్నాల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తాజాగా రోబో 2 లో కనిపించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు. అయితే ఈ హాలీవుడ్ హీరో రోబో 2 లో ఎలాంటి గెటప్ లో కనిపించబోతున్నాడనేదే ఇండస్ట్రీకి ఇప్పుడు మిలియన్ డాలర్స్ క్వశ్చిన్. ఇది ఇలా ఉంటే ఈ విషయం పై రీసెంట్ గా కోలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఆర్నాల్డ్ తన ఓన్ ఫ్రాంఛైజ్ అయిన టెర్మీనేటర్ గెటెప్ లోనే కనిపించబోతున్నాడట. మరి మన కోలీవుడ్ రోబోతో ఆ హాలీవుడ్ టెర్మీనేటర్ ఎలా పోటీపడతాడో వేచిచూడాలి.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







