ఎమర్జన్సీ క్యాష్ ట్రాన్స్ఫర్కి కష్టాలు
- November 17, 2016
అబుధాబి: యూఏఈలోని భారతీయ వలసదారులు అత్యవసర పరిస్థితుల్లో తమవారికి డబ్బు పంపించడం చాలా కష్టమవుతోంది. భారతదేశంలోని కలెక్షన్ పాయింట్స్ వద్ద తగిన మొత్తంలో కరెన్సీ నోట్స్ లేకపోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. 500, 1000 రూపాయల నోట్ల రద్దుతో భారతదేశంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. డబ్బులు పంపిస్తున్నా, అది సకాలంలో తమవారికి చేరడంలేదని బాధితులు వాపోతున్నారు. అబ్దుల్ కరీమ్ అనే వ్యక్తి 25,000 రూపాయల్ని ఇన్స్టంట్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా పంపించినా, అది చేరాల్సిన చోటుకి చేరలేదు. తన కుమార్తెకి డెలివరీ అయ్యిందనీ, అత్యవసర పరిస్థితుల్లో తాను ఆమె కోసం డబ్బు పంపించానని అబ్దుల్ కరీమ్ వాపోయారు. బ్యాంకుల నుంచి డ్రా చేసుకునే మొత్తానికి కూడా పరిమితి ఉండడంతో ఆసుపత్రిలో చెల్లింపులకు తీవ్ర ఇబ్బందులు పడవలసి వచ్చిందని ఆయన అన్నారు. వినియోగదారుల సమస్యల పట్ల స్పందించిన ఎక్స్ప్రెస్ మనీ సీఓఓ సుదీష్ గిరియాన్, కొద్ది రోజుల్లో ఈ పరిస్థితి సద్దుమణుగుతుందనీ అప్పటివరకూ వినియోగదారుల సమస్యల పట్ల చింతిస్తున్నామని అన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







