ఇమ్మిగ్రేషన్ అధికారుల్లా స్కామర్స్
- November 17, 2016
మనామా: బహ్రెయిన్ నివాసితులు, ఇమ్మిగ్రేషన్ అధికారుల్లా వేషం మార్చిన కొందరు స్కామర్స్తో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇమ్మిగ్రేషన్ అధికారులమని చెబుతూ ఫోన్ కాల్ ద్వారా రెసిడెంట్స్ని బెదిరించి, వారి నుంచి పెద్దమొత్తాల్లో కొందరు వసూలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి వెళ్ళింది. ఇలా ఎవరైనా ఫోన్ కాల్ చేసినప్పుడు తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. స్మితా షైజు అనే వ్యక్తి ఇదే తరహాలో ఫోన్ కాల్ని ఎదుర్కొన్నారు. ఇమ్మిగ్రేషన్ నెంబర్ తరహాలోనే వారు ఫోన్ చేసిన నెంబర్ ఉందని స్మిత వెల్లడించారు. వారికి తన నెంబర్ ఎలా తెలిసిందో అర్థం కాలేదనీ, తనపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు బెదిరించారనీ, పేమెంట్ డ్యూస్ చెల్లించకపోతే కఠిన శిక్షలు తప్పవని చెప్పారని ఆమె వివరించారు. స్పూఫ్ కాలర్ ఐడి ద్వారా ఇలాంటి స్కామర్స్ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. రెసిడెంట్స్ అప్రమత్తంగా ఉండటంతోపాటు, ఇమ్మిగ్రేషన్ అధికారులమని ఎవరైనా కాల్ చేసినప్పుడు వ్యక్తిగత వివరాలు వెల్లడించరాదని అధికారులు సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







