నోట్ల మార్పిడికి విమానాశ్రయాల్లో బ్యాంకులకు అనుమతి

- November 17, 2016 , by Maagulf
నోట్ల మార్పిడికి విమానాశ్రయాల్లో బ్యాంకులకు అనుమతి

నోట్ల రద్దు నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్ ఇచ్చింది. బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో నోట్ల మార్పిడిపై భారీ క్యూలు ఉంటుండటంతో నోట్ల మార్పిడికి దేశవ్యాప్తంగా ఉన్న తమ ఎయిర్‌పోర్ట్‌ల వద్ద కౌంటర్లు ఉచితంగా ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపింది. ఇందుకోసం ఏ ప్రైవేట్ బ్యాంకులైనా ముందుకు రావచ్చని ఆహ్వానించింది. తాము కరెంట్ ఛార్జీలు కూడా వసూలు చేయబోమని, నోట్ల మార్పిడి చేసుకునేందుకు కౌంటర్ స్థలం కూడా ఫ్రీగా ఇస్తామని తెలిపింది. విమాన ప్రయాణికులు కూడా నోట్ల మార్పిడికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com