హైదరాబాద్లో పాతనోట్ల మార్పిడికి కొత్త విధానం!
- November 19, 2016
నగర జనానికి ఓ గుడ్న్యూస్. రద్దీతో విసిగిపోయి బ్యాంకులు కాకుండా మరి ఇంకెక్కడైనా పాతనోట్లు తీసుకుంటే బాగుండు అని ఆలోచిస్తున్నారా?.. అయితే మీకోసమే హైదరాబాద్లో ఓ కొత్త పథకం అమలులోకి వచ్చింది. నగరంలోని ఎర్రగడ్డ రైతు బజార్లో కేంద్రీయ భండార్ అనే సంస్థ ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ సంస్థ ఆధ్వర్యంలో ఎర్రగడ్డలోని రైతుబజార్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ పాత రూ. 500, రూ. 1000 నోట్లను తీసుకొని అంతే విలువైన నిత్యావసరాలను ఇస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం రైతు బజార్లపైనా తీవ్రంగా పడిన విషయం తెలిసిందే. ఎప్పుడూ రద్దీగా ఉండే రైతు బజార్లు, కిరాణషాపులు, పండ్ల మార్కెట్లు జనాలు లేక పది రోజుల నుంచి వెలవెలబోతున్నాయి.
చిల్లర లేక, ఉన్న పాత నోట్లను మార్చుకోలేక జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు కూరగాయల ధరలు కూడా విపరీతంగా పడిపోవడంతో రైతుల కష్టాలు అంతాఇంతా కాదు. ఇక తోపుడు బండ్లు, రైతు బజార్లు, పాల కేంద్రాలు తదితర చిరు వ్యాపారాల పరిస్థితి దారుణం. ఈ నేపథ్యంలో కేంద్రీయ భండార్ సంస్థ ఎర్రగడ్డ రైతు బజార్లో కొత్త స్కీమ్ను ప్రవేశపెట్టడంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పాత రూ. 1000, రూ. 500 నోట్లకు నిత్యావసర వస్తువులను అందించి పాతనోట్ల మార్పిడి వెసులుబాటును కల్పించడంతో ఎర్రగడ్డ రైతుబజారులో నేటి నుంచి పాత నోట్ల మార్పిడి అమల్లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







