పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లనున్న ఏ.పి సియం

- November 21, 2016 , by Maagulf
పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లనున్న ఏ.పి సియం

పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విదేశాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నద్ధమవుతున్నారు.అందులో భాగంగా ఈ నెల 29,30 తేదీల్లో ఆయన సింగపూర్ లో ,డిసెంబర్ 2,3 తేదీల్లో దుబాయ్ ,కువైట్ లలో పర్యటించనున్నారు.జనవరి ఆఖర్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ముందుగా వివిధ దేశాల్లో పర్యటించి పెట్టుబడుల్ని ఆకర్షించాలన్న ప్రణాళికలో భాగంగా చంద్రబాబు ఈ దేశాల్లోని పారిశ్రామికవేత్తలతో సమావేశం కావాలని భావించారు.ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలోని బృందం ఈ నెల  27 నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు ఆస్ట్రేలియా,న్యూజిలాండుల్లో పర్యటించబోతోంది.ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు(ఈడీబీ) చైర్మన్ కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలోని బృందం ఇప్పటికే కొన్ని దేశాల్ని సందర్శించి పారిశ్రామిక సంస్థలతో సంప్రదింపులు జరిపింది.భాగస్వామ్య సదస్సు జరిగేలోగా మరికొన్ని దేశాల్లో పర్యటించబోతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com