30,762 లిక్కర్ బాటిల్స్ ధ్వంసం
- November 21, 2016
జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ (జిఎసి), నాలుగు కంటెయినర్లలో 30,762 మద్యం బాటిళ్ళను ధ్వంసం చేసింది. వీటిని దోహా పోర్ట్లో స్వాధీనం చేసుకున్నారు. జిఎసి - హెడ్ ఆఫ్ ది కమిటీ నేతృత్వంలో ఈ డిస్ట్రక్షన్ ప్రాసెస్ కొనసాగింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అధికారులు కూడా ఈ ప్రాసెస్ని వీక్షించారు. మద్యం బాటిళ్ళను ధ్వంసం చేసేముందు అవసరమైన న్యాయపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. పలు రకాలైన గూడ్స్ అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని అడ్డుకుని, తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంటుంది. ఆరు నెలలకోసారి ఈ ప్రాసెస్ని నిర్వహిస్తారు. సమాజానికి హాని కలిగించే గూడ్స్ విషయంలో జిఎసి కఠినంగా వ్యవహరిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - వెపన్స్ అండ్ అమ్యునిషన్, మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ - మెడిసిన్స్ అండ్ మెడికల్ స్టఫ్, మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ - టొబాకో రిలేటెడ్ గూడ్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్మెంట్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ - అన్ఆథరైజ్డ్ రెలిజియస్ టెక్స్ట్స్ ఇలా వివిధ విభాగాలకు రిఫర్ చేస్తుంది జిఎసి. ఆల్కహాల్, పోర్నగ్రఫీ మెటీరియల్ని జిఎసి తనంతట తానుగా డిస్ట్రాయ్ చేస్తుంటుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







