30,762 లిక్కర్ బాటిల్స్ ధ్వంసం
- November 21, 2016
జనరల్ అథారిటీ ఆఫ్ కస్టమ్స్ (జిఎసి), నాలుగు కంటెయినర్లలో 30,762 మద్యం బాటిళ్ళను ధ్వంసం చేసింది. వీటిని దోహా పోర్ట్లో స్వాధీనం చేసుకున్నారు. జిఎసి - హెడ్ ఆఫ్ ది కమిటీ నేతృత్వంలో ఈ డిస్ట్రక్షన్ ప్రాసెస్ కొనసాగింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అధికారులు కూడా ఈ ప్రాసెస్ని వీక్షించారు. మద్యం బాటిళ్ళను ధ్వంసం చేసేముందు అవసరమైన న్యాయపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. పలు రకాలైన గూడ్స్ అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్నప్పుడు వాటిని అడ్డుకుని, తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంటుంది. ఆరు నెలలకోసారి ఈ ప్రాసెస్ని నిర్వహిస్తారు. సమాజానికి హాని కలిగించే గూడ్స్ విషయంలో జిఎసి కఠినంగా వ్యవహరిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - వెపన్స్ అండ్ అమ్యునిషన్, మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ - మెడిసిన్స్ అండ్ మెడికల్ స్టఫ్, మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ - టొబాకో రిలేటెడ్ గూడ్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎండోవ్మెంట్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ - అన్ఆథరైజ్డ్ రెలిజియస్ టెక్స్ట్స్ ఇలా వివిధ విభాగాలకు రిఫర్ చేస్తుంది జిఎసి. ఆల్కహాల్, పోర్నగ్రఫీ మెటీరియల్ని జిఎసి తనంతట తానుగా డిస్ట్రాయ్ చేస్తుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!
- 80 అదనపు విమానాలు..97వేల మందికి లబ్ధి..!!









