అమ్నెస్టీ: 9,000 అక్రమ నివాసితులు స్వదేశాలకి
- November 24, 2016
మూడు నెలల అమ్నెస్టీ కారణంగా 9000 మంది అక్రమ నివాసితులు ఖతార్ని వీడే అవకాశాలు ఉన్నాయని సీనియర్ ఇమ్మిగ్రేషన్ అధికారులు వెల్లడించారు. ముందుగా ఇంత పెద్ద మొత్తంలో అమ్నెస్టీ కోసం దరఖాస్తులు వస్తాయనుకోలేదనీ, అయితే రాను రాను అమ్నెస్టీని ఆశ్రయించినవారి సంఖ్య పెరిగిందని, 9000 మంది దేశాన్ని వీడనున్నట్లు తాము అంచనా వేస్తున్నామని బ్రిగేడియర్ అబ్దుల్లా జబెర్ అల్ లబ్దా చెప్పారు. వర్క్ వీసా లేకుండా విదేశీయులు దేశంలో పని చేయడం ఖతారీ చట్టాల ప్రకారం అక్రమం, నేరం. ఖఫలా స్పాన్సర్ చట్టాల ప్రకారం ఎవరైనా తమ ఉద్యోగాన్ని మార్చుకోవాలనుకుంటే, ఖచ్చితంగా యజమాని నుంచి అనుమతి పొందవలసి ఉంటుంది. చాలా సందర్భాల్లో యజమానికి చెప్పకుండా వేరే ఉద్యోగాల్ని స్నేహితుల ద్వారా వెతుక్కుని, దేశంలో అక్రమ నివాసితులుగా మారిపోతున్నారు. అలాంటివారికి భవిష్యత్తులో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ సంఘాల అభ్యర్థన మేరకు ప్రభుత్వం అమ్నెస్టీని కల్పిస్తోంది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









