పసిడి కూడా అతలా కుతలమవుతోంది...
- November 24, 2016
ట్రంప్ విక్టరీ, ఫెడ్ అంచనాలు, ఎగబాకుతున్న డాలర్ విలువ, దేశంలో డీమానిటైజేషన్ ప్రకంపనల నేపథ్యంలో విలువైన లోహం పసిడి కూడా అతలా కుతలమవుతోంది. కీలకమైన మద్దతు స్థాయిల కిందకి దిగజారి రికార్డ్ స్థాయి కనిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పతనమవుతుంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి డాలర్ మారకపు విలువో రికార్డ్ స్తాయి కనిష్టాన్ని నమోదు చేసింది. బంగారం, వెండి ధరలు కూడా దాదాపు ఇదే బాటలో పయనిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు బలహీన నేపథ్యంలో గోల్డ్ ఫ్యూచర్స్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో గురువారం పసిడి నేల చూపులు చూస్తోంది.
ఏంసీఎక్స్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం రూ169లు క్షీణించి రూ 28,662 వద్ద కొనసాగుతోంది. సుమారు 2 శాతం పడిపోయిన పసిడి తొమ్మిదిన్నర నెలల కనిష్టానికి చేరింది. అలాగే ఔన్స్ సిల్వర్ ధర 0.6 శాతం క్షీణించింది. వెండికిలో ధర రూ. 40,123గా ఉంది. ప్లాటినం ధరలు 1.3 శాతం పడిపోయాయి. పల్లాడియంమాత్రం 0.2 శాతం పెరిగింది.
అయితే గోల్డ్ ఫ్యూచర్స్ లో బలహీనత కొనసాగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విలువైన మెటల్ ధరలు తొమ్మిది నెలల కనిష్టానికి చేరడం బలహీన సంకేతమని..అప్రమత్తంగా ఉండాలని ట్రేడర్లకు సూచిస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఖాయమన్న అంచనాలతో మదుపర్లు డాలర్ల కొనుగోళ్ల వైపు మళ్లారని అభిప్రాయపడ్డారు. సింగపూర్ లో బంగారం ధరలు 0.5 శాతం పతనమైంది. ఔన్సు పసిడి ధర 1,182.95 డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







