పసిడి కూడా అతలా కుతలమవుతోంది...
- November 24, 2016
ట్రంప్ విక్టరీ, ఫెడ్ అంచనాలు, ఎగబాకుతున్న డాలర్ విలువ, దేశంలో డీమానిటైజేషన్ ప్రకంపనల నేపథ్యంలో విలువైన లోహం పసిడి కూడా అతలా కుతలమవుతోంది. కీలకమైన మద్దతు స్థాయిల కిందకి దిగజారి రికార్డ్ స్థాయి కనిష్టాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పతనమవుతుంగా దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి డాలర్ మారకపు విలువో రికార్డ్ స్తాయి కనిష్టాన్ని నమోదు చేసింది. బంగారం, వెండి ధరలు కూడా దాదాపు ఇదే బాటలో పయనిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లు బలహీన నేపథ్యంలో గోల్డ్ ఫ్యూచర్స్ లో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో గురువారం పసిడి నేల చూపులు చూస్తోంది.
ఏంసీఎక్స్ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం రూ169లు క్షీణించి రూ 28,662 వద్ద కొనసాగుతోంది. సుమారు 2 శాతం పడిపోయిన పసిడి తొమ్మిదిన్నర నెలల కనిష్టానికి చేరింది. అలాగే ఔన్స్ సిల్వర్ ధర 0.6 శాతం క్షీణించింది. వెండికిలో ధర రూ. 40,123గా ఉంది. ప్లాటినం ధరలు 1.3 శాతం పడిపోయాయి. పల్లాడియంమాత్రం 0.2 శాతం పెరిగింది.
అయితే గోల్డ్ ఫ్యూచర్స్ లో బలహీనత కొనసాగనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విలువైన మెటల్ ధరలు తొమ్మిది నెలల కనిష్టానికి చేరడం బలహీన సంకేతమని..అప్రమత్తంగా ఉండాలని ట్రేడర్లకు సూచిస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఖాయమన్న అంచనాలతో మదుపర్లు డాలర్ల కొనుగోళ్ల వైపు మళ్లారని అభిప్రాయపడ్డారు. సింగపూర్ లో బంగారం ధరలు 0.5 శాతం పతనమైంది. ఔన్సు పసిడి ధర 1,182.95 డాలర్లకు చేరింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









