చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్లో ఘోర ప్రమాదం...
- November 24, 2016
చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్లో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చేసుకుంది. నిర్మాణంలో ఉన్న పవర్ ప్లాంట్ కూలి 22 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో ప్లాంట్ ఒక్కసారిగాఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. శిథిలాల కింద ఎక్కువ మంది చిక్కుకున్నట్లు చైనాకి చెందిన న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సహాయ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. కాంక్రీటు పలకలు విరగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన ధూళి వ్యాపించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
చైనాలో పారిశ్రామిక ప్రమాదాలు జరగడం సాధారణంగా మారిందిసరైన జాగ్రత్తలు తీసుకోకుండా కట్టడాలు నిర్మించడంతో తరుచూ ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. ఆగస్టు నెలలో జరిగిన పైప్లైన్ పేలుడు కారణంగా 21 మంది మృతి చెందారు. గతేడాది ఓ ప్లాంట్లో రసాయనాలు విడుదల కారణంగా 130 మంది అస్వస్థకు గురయ్యారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









