చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్లో ఘోర ప్రమాదం...
- November 24, 2016
చైనాలోని జియాంగ్జి ప్రావిన్స్లో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చేసుకుంది. నిర్మాణంలో ఉన్న పవర్ ప్లాంట్ కూలి 22 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. కార్మికులు విధుల్లో ఉన్న సమయంలో ప్లాంట్ ఒక్కసారిగాఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. శిథిలాల కింద ఎక్కువ మంది చిక్కుకున్నట్లు చైనాకి చెందిన న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. సహాయ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యారు. కాంక్రీటు పలకలు విరగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన ధూళి వ్యాపించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
చైనాలో పారిశ్రామిక ప్రమాదాలు జరగడం సాధారణంగా మారిందిసరైన జాగ్రత్తలు తీసుకోకుండా కట్టడాలు నిర్మించడంతో తరుచూ ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలను బలిగొంటున్నాయి. ఆగస్టు నెలలో జరిగిన పైప్లైన్ పేలుడు కారణంగా 21 మంది మృతి చెందారు. గతేడాది ఓ ప్లాంట్లో రసాయనాలు విడుదల కారణంగా 130 మంది అస్వస్థకు గురయ్యారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







