వాటర్ సప్లైలో సమస్యలు తలెత్తవచ్చు
- November 24, 2016
మస్కట్: అమెరాత్లో వాటర్ సప్లై సమస్యలు తలెత్తవచ్చని పబ్లిక్ అథారిటీ ఫర్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ (పిఎఇడబ్ల్యు) ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. వాడి అదయ్ పంపింగ్ స్టేషన్ వద్ద తలెత్తిన లీకేజీ సమస్యలే దీనికి కారణం. రానున్న 24 గంటల్లో ఈ సమస్య ఉంటుందని పిఎఇడబ్ల్యు వర్గాలు సూచించాయి. వాటర్ ట్యాంకర్లు సమీపంలో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ల వద్దకు వెళ్ళి నింపుకోవాలని సూచించారు అధికారులు. గురువారం 24 గంటలపాటు మస్కట్ మరియు మట్రా ప్రాంతాల్లో నీటి సరఫరా సమస్యలు తలెత్తవచ్చు. దర్సైత్, తివాన్, కోరినచ్, ముట్రా సౌక్, ది పోర్ట్, జిబ్రూ, అల్ వషాల్, తివాన్ మ&ట్రా మరియు జుబాదియా వంటి చోట్ల కూడా సమస్యలు ఉంటాయి. వినియోగదారులు 48 గంటల పాటు నీటిని స్టోర్ చేసుకోవాలని, సమస్య పరిష్కారమయ్యేదాకా పొదుపుగా వాడుకోవాలని పిఎఇడబ్ల్యు అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









