వాటర్ సప్లైలో సమస్యలు తలెత్తవచ్చు
- November 24, 2016
మస్కట్: అమెరాత్లో వాటర్ సప్లై సమస్యలు తలెత్తవచ్చని పబ్లిక్ అథారిటీ ఫర్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ (పిఎఇడబ్ల్యు) ట్విట్టర్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. వాడి అదయ్ పంపింగ్ స్టేషన్ వద్ద తలెత్తిన లీకేజీ సమస్యలే దీనికి కారణం. రానున్న 24 గంటల్లో ఈ సమస్య ఉంటుందని పిఎఇడబ్ల్యు వర్గాలు సూచించాయి. వాటర్ ట్యాంకర్లు సమీపంలో ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ల వద్దకు వెళ్ళి నింపుకోవాలని సూచించారు అధికారులు. గురువారం 24 గంటలపాటు మస్కట్ మరియు మట్రా ప్రాంతాల్లో నీటి సరఫరా సమస్యలు తలెత్తవచ్చు. దర్సైత్, తివాన్, కోరినచ్, ముట్రా సౌక్, ది పోర్ట్, జిబ్రూ, అల్ వషాల్, తివాన్ మ&ట్రా మరియు జుబాదియా వంటి చోట్ల కూడా సమస్యలు ఉంటాయి. వినియోగదారులు 48 గంటల పాటు నీటిని స్టోర్ చేసుకోవాలని, సమస్య పరిష్కారమయ్యేదాకా పొదుపుగా వాడుకోవాలని పిఎఇడబ్ల్యు అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!







