తగ్గినా వెండి, పసిడి ధరలు

- November 24, 2016 , by Maagulf
తగ్గినా వెండి, పసిడి ధరలు

స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిసాయి. 192 పాయింట్లు నష్టపోయిన బీఎస్‌ఈ సెన్సెక్స్ 25,860 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్లు పతనమై 7,965 పాయింట్లవద్ద ట్రేడ్ అయింది. విదేశీ ఇన్వెస్టర్లు తమ స్టాక్స్‌ను అమ్ముకునేందుకే మొగ్గు చూపారు. టీసీఎస్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, ఎస్‌బీఐ షేర్లు లాభపడగా..టాటా మోటార్స్, ఆదానిపోర్ట్స్, యాక్సెస్ బ్యాంక్, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి. అటు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సయితం తగ్గాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 28,719లుగా ఉంది. కిలో వెండి రూ. 40,250లుగా ఉంది. డాలర్ మారకం విలువ రూ. 68.72లుగా ఉంది. రూపాయి మరింతగా పతనమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com