హైదరాబాద్లో జరగనున్న 'ఐపీటీఎల్-2016' టెన్నిస్ ఫైనల్స్
- November 24, 2016'ఐపీటీఎల్-2016' టెన్నిస్ ఫైనల్స్ హైదరాబాద్లో జరగనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. డిసెంబర్ 9,10,11 తేదీల్లో ఈ పోటీలు జరగుతాయని చెప్పారు. ఐపీటీఎల్ను హైదరాబాద్కు తెచ్చినందుకు మహేశ్భూపతికి ధన్యవాదాలు తెలిపారు. గోపీచంద్ అకాడమీ ద్వారా సైనా, సింధు, కశ్యప్ లాంటి ఛాంపియన్లు తయారయ్యారని.. టెన్నిస్లో సానియా మీర్జా అంతర్జాతీయ పేరు ప్రఖ్యాత్యులు సంపాదించిందని పేర్కొన్నారు. ఫెదరర్, సెరీనా విలియమ్స్ లాంటి ఆటగాళ్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారని.. దీనివల్ల పిల్లలకు ఆటపై మరింత ఆసక్తి పెరుగుతుందని చెప్పారు. హైదరాబాద్లో టెన్నిస్ అకాడమీని ఏర్పాటు చేయాలని మహేశ్భూపతిని కోరినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. దిల్లీ, ముంబయి, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్ నగరాలను పరిశీలించానని తెలంగాణ ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్లో ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నామని మహేశ్ వెల్లడించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







