జెడ్డా నుంచి వచ్చే విమానంలో భారత యాత్రికుని మృతి

- November 25, 2016 , by Maagulf
జెడ్డా నుంచి వచ్చే విమానంలో భారత యాత్రికుని మృతి

మస్కట్ : పుణ్యక్షేత్ర సందర్శన తర్వాత ఆ ఆత్మ సంతృప్తి చెంది తనువు చాలించిందేమో అన్నట్లుగా ఒక భారతీయ వ్యక్తి విమానంలో ప్రాణాలు విడిచాడు. వివరాలలోకి వెళితే, సౌదీ విమానసంస్ధ కు చెందిన విమానం జెడ్డా నుంచి భారదేశంకు ప్రయాణిస్తుండగా ఒక భారతీయ తీర్ధ యాత్రికుడు మరణించిన సందర్భంలో ఆ విమానాన్ని ఒమాన్ వైపునకు మళ్లించారు. దక్షిణ భారతదేశం తమిళనాడు రాష్ట్రంకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ ముథాలిప్ (63) తీర్ధయాత్ర ముగించుకున్న తర్వాత తన కుటుంబంతో సహా జెడ్డా నుండి స్వదేశానికి తిరిగివస్తున్న సందర్భంలో ఈ విషాదం చోటుచేసుకొంది. ఉమ్రా సమూహ నాయకుడు మఖ్సూబ్ సాహిబ్ తెలిపిన వివరాల ప్రకారం, విమాన మళ్లింపు తర్వాత మొహమ్మద్ అబ్దుల్ ముథాలిప్ మృతదేహం గురువారం నుంచి మస్కట్ లోనే ఉందని తెలిపారు.మఖ్సూబ్ సాహిబ్ " మా గల్ఫ్ డాట్ కామ్ " తో  మాట్లాడుతూ, మొహమ్మద్ అబ్దుల్ ముథాలిప్ ఒక మధుమేహ (డయాబెటిక్) వ్యాధిగ్రస్తుడని అంతేకాక ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆయనకు జ్వరం వచ్చింది. మేము సౌదీ విమానాశ్రయం వద్ద మొహమ్మద్ అబ్దుల్ ముథాలిప్ కు  చికిత్స చేయించాం. విమాన ప్రయాణం చేయడానికి తగిన ఆరోగ్యంతో ఆయన ఉండటంతో బయలుదేరాం. మేము చివరిసారి చూసినపుడు ఆయన విమానంలో నిద్ర పోతున్నారు. ఆ తరువాత, మళ్ళీ మేము ఆయనను పరిశీలించగా చనిపోయినట్లుగా గుర్తించామని వివరించారు. దాంతో మేము విమాన సిబ్బందికి ఈ సమాచారం తెలియచేశాం అని అన్నారు . వెనువెంటనే ఆ  విమానం ఒమన్ వైపునకు మళ్ళించబడి అత్యవసరంగా గగనతలం నుండి కిందకు దిగవలసి వచ్చిందని, ఇదే విమానంలో మహమ్మద్ అబ్దుల్ ముథాలిప్  భార్య, బంధువులు ఉన్నారని మఖ్సూబ్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com