జెడ్డా నుంచి వచ్చే విమానంలో భారత యాత్రికుని మృతి
- November 25, 2016
మస్కట్ : పుణ్యక్షేత్ర సందర్శన తర్వాత ఆ ఆత్మ సంతృప్తి చెంది తనువు చాలించిందేమో అన్నట్లుగా ఒక భారతీయ వ్యక్తి విమానంలో ప్రాణాలు విడిచాడు. వివరాలలోకి వెళితే, సౌదీ విమానసంస్ధ కు చెందిన విమానం జెడ్డా నుంచి భారదేశంకు ప్రయాణిస్తుండగా ఒక భారతీయ తీర్ధ యాత్రికుడు మరణించిన సందర్భంలో ఆ విమానాన్ని ఒమాన్ వైపునకు మళ్లించారు. దక్షిణ భారతదేశం తమిళనాడు రాష్ట్రంకు చెందిన మొహమ్మద్ అబ్దుల్ ముథాలిప్ (63) తీర్ధయాత్ర ముగించుకున్న తర్వాత తన కుటుంబంతో సహా జెడ్డా నుండి స్వదేశానికి తిరిగివస్తున్న సందర్భంలో ఈ విషాదం చోటుచేసుకొంది. ఉమ్రా సమూహ నాయకుడు మఖ్సూబ్ సాహిబ్ తెలిపిన వివరాల ప్రకారం, విమాన మళ్లింపు తర్వాత మొహమ్మద్ అబ్దుల్ ముథాలిప్ మృతదేహం గురువారం నుంచి మస్కట్ లోనే ఉందని తెలిపారు.మఖ్సూబ్ సాహిబ్ " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, మొహమ్మద్ అబ్దుల్ ముథాలిప్ ఒక మధుమేహ (డయాబెటిక్) వ్యాధిగ్రస్తుడని అంతేకాక ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆయనకు జ్వరం వచ్చింది. మేము సౌదీ విమానాశ్రయం వద్ద మొహమ్మద్ అబ్దుల్ ముథాలిప్ కు చికిత్స చేయించాం. విమాన ప్రయాణం చేయడానికి తగిన ఆరోగ్యంతో ఆయన ఉండటంతో బయలుదేరాం. మేము చివరిసారి చూసినపుడు ఆయన విమానంలో నిద్ర పోతున్నారు. ఆ తరువాత, మళ్ళీ మేము ఆయనను పరిశీలించగా చనిపోయినట్లుగా గుర్తించామని వివరించారు. దాంతో మేము విమాన సిబ్బందికి ఈ సమాచారం తెలియచేశాం అని అన్నారు . వెనువెంటనే ఆ విమానం ఒమన్ వైపునకు మళ్ళించబడి అత్యవసరంగా గగనతలం నుండి కిందకు దిగవలసి వచ్చిందని, ఇదే విమానంలో మహమ్మద్ అబ్దుల్ ముథాలిప్ భార్య, బంధువులు ఉన్నారని మఖ్సూబ్ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







