సౌదీలో స్టాండర్డ్ ఇండియన్ వర్కర్స్కి చిన్ని ఆశ
- November 25, 2016
సౌదీ ఒగెర్ మరియు సాద్ గ్రూప్ తదితర నిర్మాణ సంస్థల్లో పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయ వలసదారులను ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా, భారత ప్రభుత్వానికి భరోసా ఇచ్చింది. లోక్సభలో మినిస్టర్ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ వికె సింగ్ చెబుతూ, సౌదీ అరేబియా, భారతీయ కార్మికుల ఎగ్జిట్ వీసాలను ఎక్స్టెండ్ చేయనున్నట్లు ప్రకటించిందనీ, అలాగే వన్ వే రిటర్న్ టికెట్ని ఇవ్వనున్నట్లు తెలిపిందనీ, రెసిడెంట్ పర్మిట్ జరీమానాల్ని ఎత్తివేయనున్నట్లు చెప్పిందనీ ఓ ప్రశ్నకు సమాధానంగా వివరించారు. భారతీయ కార్మికుల్ని ఆదుకునేందుకు తగు రీతిలో సహాయ సహకారాలు అందిస్తామని భారత ప్రభుత్వానికి సౌదీ ప్రభుత్వం తెలిపిందని చెప్పారాయన. రిపాట్రియేషన్ ఇప్పటికే ప్రారంభమైందనీ 4,358 మంది ఇప్పటికే స్వదేశానికి వచ్చారని సింగ్ చెప్పారు. కాగా ఖతార్లో వందలాదిమంది కార్మికులు ఇంకా ఎలాంటి పేమెంట్స్ లేకుండా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. కోచి, హైద్రాబాద్, గురుగ్రామ్, చెన్నయ్, లక్నోలలో మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







