సౌదీలో స్టాండర్డ్ ఇండియన్ వర్కర్స్కి చిన్ని ఆశ
- November 25, 2016
సౌదీ ఒగెర్ మరియు సాద్ గ్రూప్ తదితర నిర్మాణ సంస్థల్లో పనిచేస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయ వలసదారులను ఆదుకునేందుకు తగు చర్యలు తీసుకుంటామని సౌదీ అరేబియా, భారత ప్రభుత్వానికి భరోసా ఇచ్చింది. లోక్సభలో మినిస్టర్ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ వికె సింగ్ చెబుతూ, సౌదీ అరేబియా, భారతీయ కార్మికుల ఎగ్జిట్ వీసాలను ఎక్స్టెండ్ చేయనున్నట్లు ప్రకటించిందనీ, అలాగే వన్ వే రిటర్న్ టికెట్ని ఇవ్వనున్నట్లు తెలిపిందనీ, రెసిడెంట్ పర్మిట్ జరీమానాల్ని ఎత్తివేయనున్నట్లు చెప్పిందనీ ఓ ప్రశ్నకు సమాధానంగా వివరించారు. భారతీయ కార్మికుల్ని ఆదుకునేందుకు తగు రీతిలో సహాయ సహకారాలు అందిస్తామని భారత ప్రభుత్వానికి సౌదీ ప్రభుత్వం తెలిపిందని చెప్పారాయన. రిపాట్రియేషన్ ఇప్పటికే ప్రారంభమైందనీ 4,358 మంది ఇప్పటికే స్వదేశానికి వచ్చారని సింగ్ చెప్పారు. కాగా ఖతార్లో వందలాదిమంది కార్మికులు ఇంకా ఎలాంటి పేమెంట్స్ లేకుండా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. కోచి, హైద్రాబాద్, గురుగ్రామ్, చెన్నయ్, లక్నోలలో మైగ్రెంట్ రిసోర్స్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









