యజమాని వద్ద దొంగతనానికి పాల్పడిన వలసదారుడికి జైలు

- November 25, 2016 , by Maagulf
యజమాని వద్ద దొంగతనానికి పాల్పడిన వలసదారుడికి జైలు

దోహా క్రిమినల్‌ కోర్ట్‌ ఓ వలసదారుడికి మూడేళ్ళ జైలు శిక్షనీ, 20,000 ఖతారీ రియాల్స్‌ జరీమానాని విధించింది. ఖతారీ ఎంప్లాయర్‌ నుంచి 500,000 ఖతారీ రియాల్స్‌ దొంగతనం చేసిన కేసులో ఈ జైలు శిక్ష పడింది. దొంగిలించిన సొమ్ముని కూడా నిందితుడు యజమానికి చెల్లించవలసి ఉంటుంది. బాధితుడు తన అకౌంట్‌ నుంచి జ్యుయెలరీ వంటివి కొనుగోలు చేసినట్లుగా గుర్తించడంతో పోలీసులను ఆశ్రయించాడు. విచారణలో, నిందితుడు యజమానిని నమ్మించి మోసం చేసినట్లుగా తేలింది. దాంతో నిందితుడికి జైలు శిక్షతోపాటు, జరీమానాను విధించింది న్యాయస్థానం. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com