ఇద్దరు అన్నదమ్ముల కథ
- August 31, 2015
ఒక ఊరిలో చిన్న పుల్లయ్య, పెద్ద పుల్లయ్యా అని ఇద్దరు అన్నదమ్ములుండేవారు. వారిలో పెద్దవాడు కొంచెం అమాయకుడు. చిన్నవాడు తెలివైన వాడు. వారికి అడవి పక్కన రెండెకరాల పొలం ఉంది. అదే వారిద్దరికీ జీవనాధారం. ఆ ఏడాది పొలంలో వారు దోసతోట వేశారు. కాయలు బాగాకాశాయి. కాసిన కాయల్ని చిన్నవాడు సంతకి తీసుకెళ్లి అమ్ముకుని వచ్చేవాడు. పెద్దవాడు పొలానికి కాపలా ఉండేవాడు. ఒకరోజు అన్నయ్యని చూసి ఏంటి అన్నయ్యా అలాగున్నావు. తిండి తినడంలేదా ఏంటీ అని ఆడిగితే అన్న, తమ్ముడితో పొలంలోకి రాత్రిళ్లు రోజూ ఒక పెద్దపులి వస్తుంది.అది నన్ను ఏమీ చేయట్లేదు కానీ వచ్చి గుడిసెలో కూర్చొని నేనిచ్చే దోసకాయలు తింటూ దాని వీపు గోకించుకుంటుంది. దాంతో నాకు రోజూ నిద్ర పుండడంలేదురా అన్నాడు. అప్పుడు తమ్ముడు ఒక ఉపాయం ఆలోచించి ఒకరోజు అన్నని సంతకి పంపించి, ఆ రాత్రికి తాను గుడిసెలోపడుకున్నాడు. పెద్దపులి రానే వచ్చింది. వచ్చి రోజూలాగే తన పని చేయించుకోవాలనుకుంది. నడ్డి గోకుతూ, మధ్యలో మంచి నీళ్లు తాగొస్తానని చెప్పి చిన్నపుల్లయ్య లోపలికి వెళ్ళాడు. అప్పటికే నిప్పుల్లో ఎర్రగా కాల్చి పెట్టిన అట్ల కాడను తెచ్చి పులి వీపు మీద వాతలు వేశాడు. అంతేకుయ్యో మొర్రో అనుకుంటూ పెద్దపులి అక్కడినుండి పారిపోయింది. మళ్లీ అటువైపు రాలేదు. అప్పట్నుంచీ అన్నదమ్ములకు పెద్దపులి పీడ వదిలిపోయింది. ఇద్దరూ ఆరోగ్యంగా దోసతోటను సాగు చేసుకుంటూ హాయిగా జీవించసాగారు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







