విమానాశ్రయం లో భారి చోరి

- August 31, 2015 , by Maagulf
విమానాశ్రయం లో భారి చోరి

దుండగులు ఏకంగా విమానశ్రయంపైనే దాడి చేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు. 12 మంది సాయుధులు కాల్పులు జరుపుతూ దోపీడీకి తెగించారు. విమానంలోకి ఎక్కాల్సిన బంగారం కలిగిన కార్లపై కాల్పులు జరిపారు. దాదాపు 123 కిలోల బంగారం, రూ.13.3 కోట్ల నగదును దోచుకెళ్లారు. పెరూ దేశంలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. పెరూ దేశంలో విమానాశ్రయంలో మరికొద్ది సేపట్లో విమానంలోకి లోడ్ కాబోతున్న 123 కిలోల బంగారాన్ని దోచేశారు. 12 మందికి పైగా ఉన్న సాయుధులు రన్ వే మీదకు దూసుకొచ్చి, తుపాకులతో కాల్పులు జరిపి బష్పవాయుగోళాలు ప్రయోగించారు. పోలీసులు వెంటనే అప్రమత్తం కావడంతో వాళ్లలో ఆరుగురిని పట్టుకుని, వారి వద్ద నుంచి 30 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com