లింగమార్పిడి వ్యక్తులకు ఇండియన్ రైల్వే శుభవార్త

- November 27, 2016 , by Maagulf
లింగమార్పిడి వ్యక్తులకు ఇండియన్ రైల్వే శుభవార్త

లింగమార్పిడి(ట్రాన్స్‌జెండర్లు) చేయించుకున్న వ్యక్తులకు రైల్వే శుభవార్త చెప్పింది. టికెట్ రిజర్వేషన్, క్యాన్సిలేషన్ ఫామ్‌లలో వారిని 'థర్ట్ జెండర్'(మూడో లింగం)గా పరిగణిస్తూ ప్రత్యేకంగా ఓ కాలమ్ ఏర్పాటు చేసింది. రిజర్వేషన్ ఫామ్‌లలో ఈ కాలమ్ ఏర్పాటు చేయాలన్న ఢిల్లీకి చెందిన ఓ లాయర్ సూచన మేరకు రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. రైల్వే, ఐఆర్‌సీటీసీ తాజా నిర్ణయంతో అటు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా ఓ కాలమ్ అందుబాటులోకి రానుంది. రైల్వే నిర్ణయంపై ట్రాన్స్‌జెండర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదొక్కటే సరిపోదని చెబుతున్నారు. తమకోసం ప్రత్యేకంగా సీట్లు, ప్రత్యేక కోచ్‌లు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com