భారత్ దిగుమతులను తాత్కాలికంగా పాక్ నిలిపివేసింది..
- November 27, 2016
భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి చేసుకుంటున్న దిగుమతులను పాక్ ఆపేసింది. భారత్ నుంచి పత్తి, కూరగాయలను పాక్ దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వాటి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఎటువంటి హెచ్చరికలు కానీ, నోటీసులు కానీ లేకుండానే పాక్.. భారత్ నుంచి పత్తి, కూరగాయల దిగుమతిని ఆపేసిందని కాటన్ ఇంపోర్టర్స్ అండ్ కస్టమ్స్ క్లియరింగ్ ఏజెంట్లు తెలిపారు. మరోవైపు తమ దేశంలోని రైతుల సంక్షేమం కోసమే భారత్ నుంచి దిగుమతులు ఆపేసినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్(డీపీపీ) చీఫ్ ఇమ్రాన్ షమీ తెలిపారు.''మా రైతులను రక్షించుకునేందుకే భారత్ నుంచి టమాటా, ఇతర తాజా కూరగాయల దిగుమతిని రద్దు చేశాం. మా దగ్గరే చాలినన్ని టమాటాలు, ఇతర కూరగాయలు ఉన్నాయి. మా దగ్గర కొరత ఉంటేనే వాటిని దిగుమతి చేసుకునేవాళ్లం'' అని ఇమ్రాన్ వివరించారు. అయితే భారత్ నుంచి పత్తి దిగుమతులను మాత్రం ఆపలేదని, భారత్ ఎగుమతులు తమ బయో సెక్యూరిటీ షరతులకు అనుగుణంగా లేకపోవడంతో ఆంక్షలు విధించామని తెలిపారు.తమ రిపోర్టులు తప్పని తేలితే తిరిగి పత్తి దిగుమతులపై ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తామని ఇమ్రాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









