భారత్ దిగుమతులను తాత్కాలికంగా పాక్ నిలిపివేసింది..
- November 27, 2016
భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి చేసుకుంటున్న దిగుమతులను పాక్ ఆపేసింది. భారత్ నుంచి పత్తి, కూరగాయలను పాక్ దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వాటి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఎటువంటి హెచ్చరికలు కానీ, నోటీసులు కానీ లేకుండానే పాక్.. భారత్ నుంచి పత్తి, కూరగాయల దిగుమతిని ఆపేసిందని కాటన్ ఇంపోర్టర్స్ అండ్ కస్టమ్స్ క్లియరింగ్ ఏజెంట్లు తెలిపారు. మరోవైపు తమ దేశంలోని రైతుల సంక్షేమం కోసమే భారత్ నుంచి దిగుమతులు ఆపేసినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్(డీపీపీ) చీఫ్ ఇమ్రాన్ షమీ తెలిపారు.''మా రైతులను రక్షించుకునేందుకే భారత్ నుంచి టమాటా, ఇతర తాజా కూరగాయల దిగుమతిని రద్దు చేశాం. మా దగ్గరే చాలినన్ని టమాటాలు, ఇతర కూరగాయలు ఉన్నాయి. మా దగ్గర కొరత ఉంటేనే వాటిని దిగుమతి చేసుకునేవాళ్లం'' అని ఇమ్రాన్ వివరించారు. అయితే భారత్ నుంచి పత్తి దిగుమతులను మాత్రం ఆపలేదని, భారత్ ఎగుమతులు తమ బయో సెక్యూరిటీ షరతులకు అనుగుణంగా లేకపోవడంతో ఆంక్షలు విధించామని తెలిపారు.తమ రిపోర్టులు తప్పని తేలితే తిరిగి పత్తి దిగుమతులపై ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తామని ఇమ్రాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







