భారత్ దిగుమతులను తాత్కాలికంగా పాక్ నిలిపివేసింది..
- November 27, 2016
భారత్-పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ నుంచి చేసుకుంటున్న దిగుమతులను పాక్ ఆపేసింది. భారత్ నుంచి పత్తి, కూరగాయలను పాక్ దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో వాటి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఎటువంటి హెచ్చరికలు కానీ, నోటీసులు కానీ లేకుండానే పాక్.. భారత్ నుంచి పత్తి, కూరగాయల దిగుమతిని ఆపేసిందని కాటన్ ఇంపోర్టర్స్ అండ్ కస్టమ్స్ క్లియరింగ్ ఏజెంట్లు తెలిపారు. మరోవైపు తమ దేశంలోని రైతుల సంక్షేమం కోసమే భారత్ నుంచి దిగుమతులు ఆపేసినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్(డీపీపీ) చీఫ్ ఇమ్రాన్ షమీ తెలిపారు.''మా రైతులను రక్షించుకునేందుకే భారత్ నుంచి టమాటా, ఇతర తాజా కూరగాయల దిగుమతిని రద్దు చేశాం. మా దగ్గరే చాలినన్ని టమాటాలు, ఇతర కూరగాయలు ఉన్నాయి. మా దగ్గర కొరత ఉంటేనే వాటిని దిగుమతి చేసుకునేవాళ్లం'' అని ఇమ్రాన్ వివరించారు. అయితే భారత్ నుంచి పత్తి దిగుమతులను మాత్రం ఆపలేదని, భారత్ ఎగుమతులు తమ బయో సెక్యూరిటీ షరతులకు అనుగుణంగా లేకపోవడంతో ఆంక్షలు విధించామని తెలిపారు.తమ రిపోర్టులు తప్పని తేలితే తిరిగి పత్తి దిగుమతులపై ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తామని ఇమ్రాన్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









