నిత్యనూతన తారలంటే శ్రీదేవి, మాధురీ దీక్షిత్
- November 29, 2016
శ్రీదేవి, మాధురీ దీక్షిత్.వీళ్ల వయసు యాభై ఏళ్ల పైనే. అందం మాత్రం ముప్పైలో ఆగిపోయింది. నిన్నటితరం నాయికలు ఎక్కడైనా బయట కనిపిస్తే.అప్పట్లో ఎలా ఉండేది అనుకుంటారు. కానీ శ్రీదేవి, మాధురీ కనిపిస్తే.ఇంచుమించు అలాగే ఉన్నారే అని ఆశ్చర్యపడతారు. ఓ తరం తెరపై ఆస్వాదించిన సౌందర్యం ఇద్దరిదీ. నాయికల్లో వీళ్లకున్న ఆకర్షణ అసాధారణం. కథా కథనాలు, హీరోలు, దర్శకులు ..ఇవన్నీ వదిలేసి వీళ్ల అందాన్ని చూసేందుకు సినిమాలకు వెళ్లే ఆరాధకులున్నారు.
అభిమానులున్నారు. నువ్వేమన్నా శ్రీదేవివా, మాధురీ వా అన్నంతగా జనబాహుల్యంలో మార్మోగిపోయిన పేరు వీళ్లది. దశాబ్దాలుగా వెండితెరను వెలిగించిన ఈ అందాల తారలు.తరుచుగా సినిమాలు చేయకున్నా.అప్పుడప్పుడు మెరుస్తూనే ఉన్నారు. ఐదు పదుల్లోనూ గ్లామర్ కాపాడుకోవడం మాటలు కాదు.
అదెంత కష్టమో మనకు అనుభవమే. ఇటీవల క్విజ్ కార్యక్రమంలో శ్రీదేవి, మాధురీ ఉత్సాహంగా పాల్గొన్నారు. కెరీర్ విశేషాల గురించి అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పారు. తమ ఫేవరేట్ పాటలకు కలిసి డాన్సులు చేశారు.
నిత్యనూతన తారలంటే ఎలా ఉంటారో చూపించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







