ప్రయాణీకుడ్ని దోచుకున్న కేసులో ఎయిర్పోర్ట్ పోర్టర్కి జైలు
- November 30, 2016
ఉబాయ్: ఎయిర్పోర్ట్లో పోర్టర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష పడింది. ఓ వ్యాపారవేత్తకు చెందిన బ్యాగ్ సేఫ్టీ టేప్ని తొలగించి, అందులో ఉన్న 266,000 దిర్హామ్లను దోచుకున్న కేసులో నేరం నిరూపణ అమ్యింది. భారతదేశానికి చెందిన వ్యాపారవేత్త, 1.1 మిలియన్ దిర్హామ్లతో దుబాయ్కి వచ్చారు. ఆ మొత్తంతో బంగారాన్ని కొనుగోలు చేసి, ఎక్స్పోర్ట్ చేయదలచారాయన. 28 ఏళ్ళ బంగ్లాదేశీ పోర్టర్, ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. ఇంకో వైపున 29 ఏళ్ళ ఘనియన్ పోర్టర్ 1,000 దిర్హామ్ల జరీమానాకు గురయ్యాడు. దొంగతనానికి సంబంధించిన సమాచారాన్ని దాచిపెట్టిన కేసులో ఈ జరీమానా విధించింది న్యాయస్థానం. కన్వేయర్స్ బెల్ట్ వద్ద లగేజ్ని తీసుకుంటున్న క్రమంలో ఓ బ్యాగ్ సీల్ సరిగ్గా లేని విషయాన్ని గుర్తించినట్లు బాధితుడైన వ్యాపారవేత్త తెలిపారు. కస్టమ్స్ వద్దకు వెళ్ళి అక్కడ తాను తీసుకొచ్చిన సొమ్ముపై డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉండగా, తీసుకొచ్చిన సొమ్ములోంచి 286,000 దిర్హామ్ల దోపిడీకి గురయినట్లు తెలుసుకున్నానని, వెంటనే పోలీసులకు సమాచారం అందించానని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







