జనవరి 1 నుంచి గోడలపై రాతలు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు
- December 01, 2016
వచ్చే జనవరి 1 నుంచి గోడలపై రాతలు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పురపాలన, పట్టణాభివృద్ధి మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. ఉల్లంఘనకు పాల్పడిన వారిలో అధికార పక్షం వారుంటే తొలి కేసు వారిపైనే నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, చెత్త వేసినా.. జరిమానా విధించే మెజిస్టీరియల్ అధికారాలు డిప్యూటీ మునిసిపల్ కమిషనర్లకు కల్పిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళికలు- పౌర సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు - మౌలిక వసతుల కల్పనపై గురువారం మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, తలసానితో పాటు, నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు.గ్రేటర్లో నాలాలపై ఆక్రమణలను ఏకపక్షంగా తొలగించకుండా.. ప్రత్యామ్నాయ ఇంజనీరింగ్ అంశాలను పరిశీలిస్తామని సమీక్ష అనంతరం మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నాలాల లోతు పెంచడం, ఎత్తుగా రిటైనింగ్ వాల్స్ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై దృష్టి సారిస్తామని ఆయన తెలియజేశారు. ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాలతో ఉత్పన్నమైన పరిస్థితుల్లో నాలాలపై 900కు పైగా ఆక్రమణలు తొలగించామని తెలిపారుసమగ్ర సర్వే చేయాలన్న హైకోర్టు ఆదేశాలతో కూల్చివేతలు తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. గ్రేటర్లోని 390 కిలోమీటర్ల నాలాల్లో 216 కి.మీ సర్వే పూర్తైందని, వాటిపై 8239 ఆక్రమణలు ఉన్నట్టు గుర్తించామన్నారు. వాటిని ఏకపక్షంగా తొలగించవద్దన్న ఎమ్మెల్యేల సూచన మేరకు ప్రత్యామ్నాయ అంశాలు పరిశీలిస్తున్నామన్నారు. తప్పదనుకుంటే మాత్రం తొలగిస్తామని మంత్రి స్పష్టం చేశారు.కాగా, శివారు ప్రాంతాలు అభివృద్ధి చెందకపోవడంపై సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎన్వీఎ్సఎస్ ప్రభాకర్, ఉప్పల్ భగాయత ప్లాట్ల కేటాయింపులో తమ అభిప్రాయం తీసుకోలేదని ఆక్షేపించారు. జీహెచ్ఎంసీకి నిధులు కేటాయించకుండా, సంస్థ ఖజానా నుంచి ఇతర విభాగాలకు నిధులు మళ్లిస్తున్నారని ఎమ్మెల్సీ జాఫ్రీ విమర్శించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







