పెరూలో లంపా పట్టణానికి 58 కిలో మీటర్ల దూరంలో భూకంపం...
- December 02, 2016
పెరూలో గురువారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైంది. భూప్రకంపనలకు ఇళ్లు, రోడ్లు ధ్వంసమయ్యాయి. కాగా ఎక్కడా ప్రాణనష్టం జరిగినట్టు సమాచారం లేదు.పెరూలో లంపా పట్టణానికి 58 కిలో మీటర్ల దూరంలో 30 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. 30 సెకన్ల పాటు భూప్రకంపనలు వచ్చాయి. దీంతో జనం భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు చెప్పారు. లంపా, పరాటియా జిల్లాలో చాలా ఇళ్లు దెబ్బతిన్నాయి. పెరూలో ఏడాదికి దాదాపు 200 భూకంపాలు వస్తుంటాయి. వీటిలో చాలావరకు ప్రజలు గుర్తించని అతిస్వల్ప ప్రకంపనలు ఉంటాయి. పెరూలో చివరిసారిగా 2007లో వచ్చిన భారీ భూకంపంలో 595 మంది మరణించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







