చైనాలోని హుబెయ్‌ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం....

- December 02, 2016 , by Maagulf
చైనాలోని హుబెయ్‌ ప్రావిన్స్‌లో  ఘోర ప్రమాదం....

 చైనాలోని హుబెయ్‌ ప్రావిన్స్‌లో శుక్రవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 20 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు మావోలింగ్‌ టౌన్‌షిప్‌ వద్దకు రాగానే అదుపు తప్పి నదిలో పడిపోయింది. దాంతో 18 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పొగమంచు ఎక్కువగా ఉన్న సమయంలో నిర్లక్ష్యంగా బస్సు నడిపినందుకే ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. గాయాలతో బయటపడిన డ్రైవర్‌ను అరెస్ట్‌ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com